(హైదరాబాద్,న్యూస్ఇన్)

దోమల సీజన్ వచ్చేసింది…. ఇప్పటి వరకు చలి పులి గజగజ వణికించింది. రికార్డు స్థాయిలో ఊష్ణోగ్రతలు తగ్గడంతో చలి ఈ సారి తీవ్ర ప్రభావం చూపింది. ఈ చలి కాలంలో దోమల పునరుత్పతికి అనువైన సమయంగా ఉంటుంది. ఈ కారణంగా నవంబర్,డిసెంబర్, జనవరి మూడు నెలల పాటు దోమలు పెట్టే గుడ్లు ఇప్పుటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగి ఆ గుడ్లు దొమలుగా వృద్ధి చెందుతాయి. ఈ దోమలు తెల్లవారు ఝాము నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ఎంతో చురుగ్గా ఉంటాయని గాలిలో తేమ పరిస్థితుల వల్ల కుడతాయని చెప్పారు. దోమ కాటు నివారణకు స్వతహాగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాబోయే రెండు నెలల పాటు దోమల కాలం వచ్చేసినట్లే అని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు. దోమల కాటు ద్వారా అనారోగ్యం బారిన పడరాదంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నీటి నిల్వ ప్రాంతాల సమీప ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు వైద్య ఆరోగ్య శాఖ చేస్తోంది.








Leave a Reply