వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు
సీఎం చంద్రబాబు నాయుడు
(అమరావతి,న్యూస్ఇన్)
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంంది. మరో రెండు నెలల్లో పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీ అమలు చేసేందుకు సిద్ధం అవుతుఉంది.వచ్చే నెలాఖారు నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. జనాభా విషయంలో చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోయింది. యూరోప్లోని దాదాపు 20 దేశాల్లో ఈ సమస్య ఉంది. అక్కడ సామాజిక వేడుకలే లేవు.” అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయ పడ్డారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.

వేసవి కాలం రానున్న నేపథ్యంలో నీటి ఎద్దడి అనేది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇప్పటి నుంచే సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూసుకోవడంతోపాటు… పశువుల దాణాకూ సమస్యలు రాకూడదని సీఎం చెప్పారు. మరోవైపు ప్రజాసమస్యలు-పాలనా తీరు తెలుసుకునేందుకు మంత్రులు, కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్ర స్థాయిలో ఎలా ఉందనే దానిని ప్రత్యక్షంగా చూడాలన్నారు. అల్లూరి జిల్లా లంబసింగిలో కుంకుమ పువ్వు ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు కశ్మీర్లో మాత్రమే కుంకుమ పువ్వు ఉత్పత్తి జరుగుతోంది. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు సమీపంలో కోకో సిటీ కూడా ఏర్పాటు అవుతుంది. కాఫీ సాగు పెంచటంతో పాటు అరకు కాఫీ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నాం.. ఇది మరింతగా పెరగాలి.” అని సీఎం చంద్రబాబు వివరించారు.
సంజీవని పథకం ద్వారా హెల్త్ స్క్రీనింగ్…

సంజీవని ద్వారా జూలై 2026 నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలి. 5 లక్షల మంది హాస్టల్ విద్యార్ధుల స్ర్కీనింగ్ చేపట్టాలి. 12వ తరగతి వరకూ ఉన్న 70 లక్షల మంది విద్యార్ధుల హెల్త్ ప్రొఫైల్స్ కూడా తయారు చేయాలి. కేర్ అండ్ గ్రో ద్వారా మాతా శిశు ఆరోగ్యం, ఎదుగుదలను నమోదు చేయాలి. పౌష్టికాహారం అందించటంతో సహా అవసరమైన సప్లిమెంట్స్ అందించేలా చర్యలు తీసుకోవాలి. అవిశ, మునగ, రకరకాల ఆకు కూరల్లో పౌష్టికాహారం లభిస్తుంది. వాటిని ఆహారంగా తీసుకోవడం మానేయడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలు, అన్న క్యాంటీన్లలో కూడా పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇక గర్భిణీల విషయంలో నార్మల్ డెలివరీలు పెరిగేలా చూడాలని సూచించారు
ఒత్తిడి లేని విద్యాభోదన ఉండాలి…

పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా 100 రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయాలి. పరీక్షలు అంటే ఎలాంటి ఒత్తిడి లేని విధంగా ఈ కార్యాచరణ ఉండాలి. ఒత్తిడి కారణంగా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోడానికి వీల్లేదు. ఒత్తిడి లేని విద్యా విధానంతోనే కొత్త ఆలోచనలు వస్తాయి… సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది. వయోజన విద్యలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా డ్వాక్రా మహిళల సహకారం తీసుకోవాలి. కేంద్రం అమలు చేస్తున్న కర్మయోగి పథకంలో ఏపీకి చెందిన వారే అగ్రస్థానంలో ఉన్నారు. సామాజిక బాధ్యత కింద ప్రైవేటు సంస్థలు యువతకు నైపుణ్యాలను కల్పించే అంశంపై దృష్టి పెట్టాలి.








Leave a Reply