నిబంధనలు సరళతరం కావాలి
సమీక్షలో సీఎం చంద్రబాబు
(అమరావతి,న్యూస్ఇన్)
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ట్రూ డౌన్ ఫలితాలు ప్రజలకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యుత్ కొనుగోలు భారాన్ని కూడా తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయంలో ఏఐ సాంకేతికత, విద్యుత్, విత్తన నిర్వహణ, డ్రోన్లు, యాంత్రీకరణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. సచివాలయంలో దాదాపు 8 గంటల పాటు వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం పలు కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు. రాయలసీమను ఉద్యాన రంగంలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేటు పెట్టుబడులపైనా దృష్టి పెట్టాలి. ప్రస్తుతం రాయలసీమ నుంచే 220 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది… త్వరలోనే 400 మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకూ 4 లేన్ రైల్వే లైన్ వస్తోంది… స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టు కూడా త్వరలోనే సాకారమవుతుంది. నెట్ జీరో ఎమిషన్ కాన్సెప్టుతో విద్యుత్ ఉత్పాదన జరగాలి. పీఎం కుసుమ్, సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులు వేగంగా చేపట్టాలి. రూ.3.90కే విద్యుత్ కొనుగోలు ధర తగ్గేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీసీలో కనీసం వెయ్యి బస్సులను ఈవీగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
పాలన సులభం కావాలి…

“చిన్న రైస్ మిల్లు పెట్టడానికి 30కు పైగా అనుమతులు కావాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి పోవాలి. చిన్నపాటి వ్యాపారం ప్రారంభించడానికి 30 చోట్లకు తిరగడం కష్టసాధ్యమైన అంశం. మరోవైపు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం… వివిధ కీలక శాఖల్లో నిబంధనలను సరళతరం చేయాలి. అగ్నిమాపక, పురపాలక, అటవీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇలా వేర్వేరు శాఖల్లో నిబంధనలను మరింత సడలించాలి. నిర్దేశిత కాలపరిమితి ముగిసిన తర్వాత చట్టాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సంస్కరణల్లో ముందుండాని అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
అధికారులనే బాధ్యులుగా చేస్తాం……
“ప్రొడెక్ట్ పర్ఫెక్షన్పై దృష్టి పెట్టాలి… నాణ్యమైన ఉత్పత్తులు వస్తేనే ఎక్కువ మార్కెట్ సాధ్యం అవుతుందన్నారు.స్వయం సహాయ సంఘాలకు కూడా స్వయం అనే పేరిట బ్రాండ్ రూపొందించాం. ఈ బ్రాండ్ ద్వారా వారు తయారు చేసిన ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.26,021 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాం.” అని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులపై నే ఉంటుందన్నారు. నిధుల వినియోగం లేకపోతే సంబంధిత అధికారులనే బాధ్యలుగా పరిగణిస్తామని హెచ్చరించారు.








Leave a Reply