
రంగంలోకి దిగిన నాగ్ పూర్ నిపుణుల కమిటీ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో జరుగుతున్న నేరాల గురించి పరీక్షలు నిర్వహించి శాస్త్రీయ పద్ధతుల్లో ఆధారాలను విశ్లేషించే ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం రాజకీయం దూమారం రేపింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ప్రమాదంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశాయి. ప్రమాదం జరిగిన తీరును విశ్లేషిస్తూ..ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా తాము భావించడం లేదన్న వాదనను తెరపైకి తెచ్చాయి. నాంపల్లిలో ఉన్న ఈ భవనం 3 వ అంతస్తులో ఉంటుంది. ఉదయం 10 గంటల సమయంలో ప్రమాదం ఉందని గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 10 గంటల వరకు పెద్ద ఎత్తున పొగలు చుట్టుమట్టడంతో అగ్నిమాపకదళం వచ్చి మంటలను అదుపు చేసేందుకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. ఈ సమయంలో ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్లు సహా భద్రపరిచిన డాటా అంతా కూడా అగ్నికి ఆహుతి అయింది.

ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కుట్ర అనిఆరోపించింది. ఓటుకు నోటు కేసులో విచారణ చివరి దశకు చేరుకోవడంతో….. సీఎం కుట్రతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బీజేపీ మరో అడుగు ముందుకు వేసి బీఆర్ ఎస్, కాంగ్రెస్ కలిసి అడుతున్న డ్రామాగా ఆరోపించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలను కాపాడే ప్రయత్నాలు అని ఆరోపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలకు ముడి పడి ఉన్న అంశాలు కావడంతో దీనిపై విచారణకు కేంద్ర ఫోరెన్సిక్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. నాగ్ పూర్ నుంచి ఈ బృందం అగ్నిప్రమాదంపై ఆరా తీసింది.సర్వర్లను రిట్రైవ్ చేసేందుకు వచ్చిన నిపుణల కమిటీ ఆ పనిలో నిమగ్నమై ఉంది. దేశంలోని అత్యంత అధునాత సంస్థ నిపుణులతో ఈ కంప్యూటర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

పొలిటికల్ పార్టీలు తెరపైకి కేసులైన ఓటుకు నోటు కేసు మెటీరియల్ 2021 లోనే కోర్టుకు సమర్పించామని పోలీసులు గతంలోనే ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న కొన్ని ఆధారాలు ధ్వంసం అయ్యాయనే అనుమానాలు అధికారుల్లో కూడా ఉన్నాయి. ఈ ఫైల్స్ ను తిరిగి పొందేందుకు ఉన్న అవకాశాలను నిపుణుల బృందం పరిశీలిస్తోంది. ల్యాబ్ నిర్వహిస్తున్న సర్వర్ల బ్యాక్ అప్ ఎక్కడ నిర్వహిస్తున్నారన్న అంశాలపై కమిటీ దృష్టి పెట్టింది.




Leave a Reply