NewsInn

News in a Click

ఏసీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

ఏసీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం
  • నిర‌స‌న‌ల‌తో వైసీపీ హాజ‌రు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

ఆంధ్ర ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు బుద‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. బ‌డ్జెట్ స‌మ‌వేశాలు కావ‌డంతో గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ త‌న ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో వివ‌రించారు. అంతుకు ముందు శాసనసభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఐటీ, హెచ్.ఆర్.డి. శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు నేతలు శాసన సభ బడ్జెట్ సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై చర్చించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ ల‌తో కూడా చ‌ర్చించారు.

వైసీపీ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం సంద‌ర్బంగా త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తూ అసెంబ్లీకి చేరుకుంది.మాజీ సీఎం జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో నేత‌లు నిర‌స‌న తెలిపారు. అసెంబ్లీ ప్ర‌భుత్వ తీరుకు వ్య‌తిరేకంగా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు” అంటూ వైసీపీ నేత‌లు నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *