NewsInn

News in a Click

మున్సిప‌ల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలు

బీఆర్ఎస్ నేత‌ల‌కు అభినంద‌న‌లు కేటిఆర్

(హైదరాబాద్,న్యూస్ఇన్)

మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురిచేసినా అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. రెండేళ్ల పాలనలో ఘోరమైన వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో దౌర్జన్య కాండకు దిగారని కేటీఆర్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే రేవంత్ రెడ్డి అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపులకు, దాడులకు రేవంత్ రెడ్డి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు.ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్…..మూడు ముక్కలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *