హృదయ విదారక ఘటన
(హైద్రాబాద్,న్యూస్ఇన్)
అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్ధుడి అంత్యక్రియలు చేసేందుకు ఆ కుటుంబానికి ఆర్థిక సమస్యలు అడ్డంకిగా మారాయి. ఎవరికి చెప్పుకోలేక… అప్పులు అడగలేక…శవాన్ని ఇంట్లోనే మూడు రోజులు పెట్టుకున్నారు. వృద్ధుడు మినహా ఆ ఇంట్లో అంతా ఆడవాళ్ళు కావడంతో ఏం చేయాలో వారికి దిక్కుతోచలేదు.

హైదరాబాద్ జీడిమెట్లలో 75 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కాలం చేసారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి జీవనోపాధి కోసం హైదరాబాద్ నుంచి ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఆ వృద్ధుడు అనారోగ్యానికి గురి కావడంతో…. ఆ కుటుంబ సంపాదన పొదుపు చేసిన డబ్బు అంతా ఇంటి పెద్ద వైద్యం ఖర్చులకు సరిపోయాయి. అంత్యక్రియలు నిర్వహించడానికి చిల్లిగవ్వలేక పోవడంతో మూడు రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు.ఇది గమనించిన ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి అంతిమ సంస్కారాల బాధ్యత తీసుకున్నారు. ఈ కుటుంబ దయనీయ పరిస్థితి తెలిసి స్థానికులు చలించిపోయారు.





Leave a Reply