
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
కొన్ని రోజుల క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భూకబ్జా ఆరోపణలతో పూర్తి ఆధారాలతో భూ యజమానులు ఫిర్యాదు చేశారు. తమ భూమిని కబ్జా చేసేందుకు మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యక్తులు వచ్చారని ఫిర్యాదు సారాంశం. భూ యజమానుల ఫిర్యాదును పరిశీలించి…మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందిస్తూ కేసు నమోదు చేసిన విషయాన్ని ధ్రువీకరించారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలుపెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసు అధికారి పై చర్యలు మొదలయ్యాయి. మంత్రి కుమారుడిపైనే కేసు నమోదు చేస్తారా…..అన్న ఆగ్రహంతో
గచ్చిబౌలి ఎస్సైకి పనిష్మెంట్ టు సన్మానాన్ని పోలీసు శాఖ ఇచ్చిందన్న టాక్ మొదలైంది.

.మంత్రి కొడుకు మీద కేసు పెట్టినందుకు వేకెన్సీ రిజర్వ్ పేరిట ఎస్సై మొహమ్మద్ హబీబుల్లా ఖాన్కు పనిష్మెంట్ ఇచ్చింది. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరున ఆ అధికారిని విఆర్ కు పంపించడం ఇప్పుడు పోలీసు శాఖలో హాట్ హాట్ గా మారింది. భూ కబ్జాలకు సహకరించకపోతే ఇలాంటి అవకాశాలు దక్కుతాయని పోలీసుల్లో ఈ వ్యవహారం చర్చకు దారితీస్తుంది.లా అండ్ ఆర్డర్ విభాగంలో”సురక్షిత్ హైదరాబాద్” అవార్డును ఇటీవలే ఈ పోలీసు అధికారి అందుకున్నారు.





Leave a Reply