NewsInn

News in a Click

మహిళా రిజర్వేషన్లు – 2029 లో జమిలీ ఎన్నికలు

మహిళా రిజర్వేషన్లు – 2029 లో జమిలీ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రంలో నేనే రాజు…. నేనే మంత్రి

2027 మే లేదా జూన్ నాటికి జనాభా లెక్కలు

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌

( న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌)

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. త్వ‌ర‌లో దేశంలో మొద‌ల‌య్యే జ‌నాభా లెక్క‌లు 2027 లో ముగుస్తాయ‌ని ఆ త‌రువాత నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌, కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు అమ‌లులోకి వ‌స్తుంద‌ని అనంత‌రం 2029 సంవంత్సరంలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ క‌లిపి దేశ వ్యాప్తంగా జ‌మిలీ ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు. ఢిల్లీలో ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లిసిన త‌రువాత సీఎం ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాపకులు ఎన్టీఆర్ జాతి ఆస్తి, ఆయన జాతీయ నాయ‌కుడ‌ని ఎవ‌రి సొత్తు కాద‌ని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్ల‌మెంట్ లో ఎన్టీఆర్ విగ్ర‌హం పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీఅని గుర్తించాల‌న్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్ర‌మాదంపై బీఆర్ ఎస్, బీజేపీలు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. కేసులో ఆధారాల‌పై విశ్లేష‌ణ పూర్త‌యిన త‌రువాత అక్క‌డ ఎలాంటి ఆధారాలు ఉండ‌వ‌న్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి మెట్రోను ప్ర‌భుత్వం టేకోవ‌ర్ చేస్తుంద‌ని చెప్పారు. జూన్ రెండో తేదీన ఆదిలాబాద్, వరంగ‌ల్ విమానాశ్ర‌యాల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో సింగ‌రేణి గురించి ఒక రోజు చ‌ర్చ పెడుతామ‌ని ఆ త‌రువాత మంత్రి కిష‌న్ రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి ఉంటుంద‌న్నారు. తెలంగాణాలో నేనే రాజు నేనే మంత్రి అని సీఎం రెవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు చేశారు.

ప్రాజెక్టుల‌పై ఏపీ అభ్యంత‌రం భావ్యం కాదు….

మాజీ సీఎం కేసిఆర్ స్వ‌యం ప్ర‌క‌టింతంగా గృహ దిగ్భంధంలో ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. నేను ఎవ‌రి ఫోన్లు ట్యాప్ చేయ‌డం లేద‌న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరం చెబుతోందన్నారు. కృష్ణ, గోదావరి బేసిన్ లో తెలంగాణ కు రావాల్సిన నీటి వాటా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కట్టుకుంటే అభ్యంత‌రం లేద‌న్నారు. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేస్తే వరద జలాల లెక్కలు తేలుతాయి.నికరజలాల లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పకూడదన్నారు. ఒక కౌన్సిలర్ కోసం హత్యారాజకీయాలు చేయ్యాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ కి అనుమానాలు ఉంటే సీబీఐతో విచార‌ణ జ‌రిపించుకోవ‌చ్చారు. అధిష్టానంతో సమావేశం లో కేబినెట్ విస్తరణ ప్రస్తావన రాలేదు.

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎవ‌రిని క‌లిసారంటే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *