NewsInn

News in a Click

హైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే: కేటీఆర్

హైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే: కేటీఆర్

ఎమ్మెల్యేలు వెళ్లినా క్యాడర్ అంతా కేసీఆర్ వెంటే

బీఆర్ఎస్‌లోకి చేరికలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా కేసీఆర్ నాయకత్వంలోనే ఉన్నారన్నారు. మొత్తం హైదరాబాద్‌లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నంబర్ వన్ కోటగా నిలిచిందన్నారు.శేరిలింగంపల్లిలోని 24 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేసే సత్తా మనకుందని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకుందని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు బీజేపీ 12 ఏళ్లుగా తెలంగాణకు 12 పైసల పని కూడా చేయలేదని, అది ‘పూజకు పనికిరాని పువ్వు’ అని ఎద్దేవా చేశారు.

“వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి” అన్న నానుడిని గుర్తు చేస్తూ, తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఏం చేసిందంటే….కేటిఆర్

డివిజన్ల వారీగా సమావేశాలు….

త్వరలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. ఎమ్మెల్యే లేడని భయపడకండి, మీకు అండగా నేను, తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణారావు ఉంటాం. ఏ అవసరమొచ్చినా మేము అందుబాటులో ఉంటామ‌ని హామీ ఇచ్చారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, విజయ్ కుమార్ రెడ్డి వంటి యువకులు పార్టీకి ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *