భారత్ – పాక్ మ్యాచ్ కు రేయిన్ ఎఫెక్ట్
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఐసీసీ టీ-20 ప్రపంచ్ కప్ ప్రారంభానికి ముందు నుంచి ఇండియా, పాకిస్తాన్ జట్ల జరిగే మ్యాచ్ పై ఉత్కంఠ రేగుతూ వచ్చింది. బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయంపై బంగ్లాకు మద్దతుగా పాక్ నిరసన వ్యక్తం చేసింది. భారత్ తో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటిచింది. చివరికి ఐసీసీ తన నిబంధనలను అమలు చేస్తామని ఖచ్చితంగా చెప్పడంతో…పాక్ పొరుగు దేశాల కోరిక మేరకు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ భారత్ ఆడేందుకు ఓకే చెప్పింది. ఇక ఈ మ్యాచ్ పై క్రీకెట్ ప్రపంచం ఎంతోఉత్కంఠగా ఎదురు చూస్తోంది.

రేపు కొలంబోలో జరిగే మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇరు జట్లు ప్రస్తుతం కొలంబోలోనే ఉన్నాయి. పాక్ గతంలోనే మ్యాచ్ లు ఆడేందుకు శ్రీలంక చేరుకుని అక్కడే ప్రాక్టీస్ చేస్తోంది. భారత జట్టు మాత్రం దేశంలో రెండు టీ20 మ్యాచ్ లు ఆడి గత రాత్రి శ్రీలంకకు చేరుకుంది. ఇరు జట్లు పోటీపడేది ఇక లాంఛనమే అనుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ వెల్లడించిన వివరాలు క్రీడా లోకాన్ని మరో సారి సస్పెన్స్ లోకి తీసుకెళుతున్నాయి.

వాతావరణ శాఖ అంచనా ప్రచారం ఫిబ్రవరి 15న పూర్తి 24 గంటల పాటు వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, వర్షం పడే అవకాశం 60% నుంచి 50% వరకు ఉదని, మ్యాచ్ సమయంలో, సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు, 10% నుండి 20% వరకు వర్షం పడే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. 14 వ తేదీన వర్షం మొదలయ్యే చాన్స్ ఉందని కూడా అనుమానం వ్యక్తం చేసింది.
వర్షం కారణంగా మ్యాచ్ జరగక పోతే రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభిస్తుంది. గ్రూప్ దశ మ్యాచ్లకు రిజర్వ్ డేలు లేవు, కాబట్టి ఫిబ్రవరి 15న మ్యాచ్ ఆడకపోతే, దానిని డ్రాగా పరిగణిస్తారు. వాతావరణ శాఖ అంచనాలు నిజమైతే క్రికెట్ అభిమానాలకు నిరాషే మిగులుతుంది. అది నిజం కాకపోతే అసలైన మ్యాచ్ చూసే అవకాశం దక్కుతుంది.









Leave a Reply