NewsInn

News in a Click

రైల్వే ప్యానెల్ కోసం న్యాయవాదులు దరఖాస్తు చేసుకోండి

(హైదరాబాద్, న్యూస్ఇన్)

రైల్వే బోర్డులో ఎంపిక కోసం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైదరాబాద్ & అమరావతిలోని సర్క్యూట్ బెంచ్ మరియు రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్స్, సికింద్రాబాద్ & అమరావతి కొరకై దక్షిణ మధ్య రైల్వే తరపున న్యాయవాదుల ప్యానెల్స్‌ ఏర్పాటుకై ఆసక్తి మరియు అర్హతగలిగిన న్యాయవాదుల నుండి దరఖాస్తులను దక్షిణ మధ్య రైల్వే ఆహ్వానిస్తోంది.


ఈ విషయంలో, అర్హత వివరాలను తెలియజేస్తూ ఎంపానెల్ చేయబడటానికి సిద్ధంగా ఉన్న న్యాయవాదుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయబడింది. న్యాయవాదుల ప్రయోజనం కోసం సంబంధిత బార్ అసోసియేషన్ల నోటీసు బోర్డులలో ఈ నోటిఫికేషన్‌ను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేయాలని బార్ అసోసియేషన్లకు సూచించడమైనది.
ఇందుకు సంబందించిన నమూనా దరఖాస్తు మరియు వివరణాత్మక నోటిఫికేషన్ దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్ www.scr.indianrailways.gov.in లో అందుబాటులో ఉంచబడ్డాయి.ఆసక్తిగల న్యాయవాదులు తమ దరఖాస్తులను జనవరి 9 , 2026న లేదా అంతకు ముందు సికింద్రాబాద్, రైల్ నిలయంలోని 3వ అంతస్తులోనున్న డి.జి.ఎం/లా కార్యాలయానికి అందజేయవచ్చు లేదా “ra.catrct.scr@gmail.com” కు మెయిల్ ద్వారా పంపవచ్చు.ఆసక్తి ఉన్న న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *