NewsInn

News in a Click

పుష్ఫా -2 కేసులో ఛార్జ్ షీట్ తిప్పి పంపిన కోర్టు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

పుష్పా-2 విడుద‌ల సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస‌లాట సినిమా రంగంలో, రాజ‌కీయ రంగంలో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. తొక్కిస‌లాట సంద‌ర్బంగా ఓ మ‌హిళ మృతి చెంద‌డం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయ ప‌డ‌డంతో స‌ర్కార్ ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్ గా ప‌రిగ‌ణించింది. సంధ్య థియేట‌ర్ యాజ‌మ‌న్యంతో పాటు న‌టుడు అల్లు అర్జున్ ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌లుగా పేర్కొంటూ కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేసేదాకా ప‌రిస్థితులు దారి తీశాయి. దీంతో కేసు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ కేసులో దాదాపు ఏడాది స‌మ‌యం తీసుకుని పోలీసులు చార్జ్ షీట్ దాఖ‌లు చేశారు. చార్జ్ షీట్లో విష‌యాల‌ను పరిశీలించిన కోర్టు ఆ చార్జ్ షీట్ స‌క్ర‌మంగా లేదంటూ తిప్పి పంపింది. ఆ త‌రువాత పోలీసులు మ‌రో చార్జ్ షీట్ సిద్దం చేసి కోర్టుకు స‌మ‌ర్పించారు. అయితే దీనిపై కూడా కోర్టు సీరియ‌స్ అయింది. రెండో సారి పంపిన చార్జ్ షీట్ పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ దాన్ని వెన‌క్కి పంపింది. పోలీసుల ఛార్జ్ షీట్‌లో సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేవని, సాంకేతిక లోపాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని కోర్టు వ్య‌క్తం చేసింది.హార్డ్‌ డిస్క్‌లు, సీడీలు, పెన్‌ డ్రైవ్‌లు సరిగ్గా జత చేసి ఛార్జ్ షీట్‌ పంపాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.ఈ తొక్కిసలాట కేసులో అల్లుఅర్జున్‌ సహా 23 మందిపై ఛార్జ్‌షీట్ ను పోలీసులు దాఖ‌లు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వానికి పలు నోటీసులు జారీ చేసిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *