
వాతావరణ శాఖ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాబోయే మూడు రోజులు తెలంగాణా వ్యాప్తంగా తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య తమిళనాడు నుండి మధ్య మహారాష్ట్ర వరకు, కర్నాటక మీదుగా మరఠ్వాఢ ప్రాంతం వరకు సగటు సముద్రం మట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో అల్పపీడన ధ్రోణి కొనసాగుతోంది.
ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.



Leave a Reply