NewsInn

News in a Click

తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోదీ క్లాస్

తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోదీ క్లాస్

మీ కంటే అసదుద్దీన్ ఫాస్ట్

విబేధాలు వీడండి

ప్రధాని కామెంట్స్ హాట్ హాట్

(హైదరాబాద్, న్యూస్ ఇన్)

సోషల్ మీడియాలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తరువాతే మీరు అంటూ… తెలంగాణ బీజేపీ ఎంపీల ముందు సోషల్ మీడియా నివేదికలను. ప్రధాని మోదీ బయటపెట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో హైదరాబాద్ ఎంపీ, తెలంగాణ బిజెపి ఎంపీల కంటే ఎంతో ముందు ఉన్నారని… రాబోయే రోజుల్లో సోషల్ మీడియా పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రజలకు మరింత చేరువ కావాలన్న సూచనలను ప్రధాని చేసినట్లు సమాచారం. ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేలా ఎంపీలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని మోడీ ఎంపీలకు హితవు చెప్పినట్లు సమాచారం.పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ప్రధాని ఎంపీలతో అల్పాహార విందు ఏర్పాటు చేశారు.

ఈ సమయంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గా విజయం సాధించినా పార్టీ పనితీరు పెద్దగా మెరుగుపడలేదని ఎంపీల ముందు ప్రధాని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. పార్టీ వెనుకబడడానికి కారణాలు ఏమిటని ఎంపీలను ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమగ్ర నివేదికను మోడీ ఎంపీల ముందు ఉంచారు. 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఎందుకు విఫలమవుతున్నామని ఎంపీల తీరుపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీకి ఆదరణ ఉన్న విషయాన్ని లోకసభ ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయని చెబుతూ… దాన్ని వినియోగించుకోకపోతే పార్టీ బలపడటం దాదాపు అసాధ్యమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బిజెపి నేతల అంతర్గత విభేదాలను ప్రస్తావించినట్లు సమాచారం. ఎంపీలందరికీ సమన్వయం లేకపోవడం…. ఎవరికి వారు గానే వ్యవహరించడం…. వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్లడం లాంటి అంశాలపై మోడీ ఎంపీలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికైనా ఎంపీలంతా కలిసికట్టుగా ఉండి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కార్యాచరణ అమలు చేయాలన్న సూచనలను ప్రధాని ఎంపీలకు చేసినట్లు సమాచారం. ప్రధాని బిజెపి ఎంపీలు ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం కమల నాతుల్లో హాట్ హాట్ గా మారింది. ఇకనైనా రాష్ట్ర బిజెపి నేతల తీరు మారుతున్న అన్న చర్చ క్యాడర్ లో మొదలైంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *