ఓటర్ల విలక్షణ తీర్పు
(హైదరాబాద్, న్యూస్ఇన్)
రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణాలో ఆశ్చర్యకర ఫలితం గురువారం వెలువడింది.వివరాల్లోకి వెళ్తే చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో గురువారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల ముందు గుండెపోటుతో మరణించిన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి (50) బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గురువారం ప్రకటించిన ఫలితాల్లో విజేతగా నిలిచారు.

చెర్ల మురళి మొత్తం 700 కంటే ఎక్కువ ఓట్లు సాధించగా, సమీప అభ్యర్థిపై 378 ఓట్ల భారీ మెజారిటీ సాధించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అభ్యర్థి మరణించినప్పటికీ ఆయన పేరిట పోలింగ్ పత్రాల్లో పేరు మార్పు చేయలేకపోవడంతో ఓటర్లు ఆయనకే ఓటు వేశారు.విజేతగా ప్రకటించిన వ్యక్తి భౌతికంగా ఇక లేనందున సర్పంచ్ పదవికి సంబంధించిన తదుపరి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశామని, ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలపై చర్చిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
సూర్యాపేట జిల్లా…..
డ్రా లో BRS బలపర్చిన అభ్యర్థికి అదృష్టం వరించింది.
ఆత్మకూర్(S) మండలం కోటినాయక్ తండాలో BRS, కాంగ్రేస్ అభ్యర్థులకు సమానంగా పోలైన ఓట్లు. డ్రాలో BRS బలపర్చిన అభ్యర్థి గెలుపు.
భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్…
సర్పంచ్ ఎన్నికల్లో భార్యాభర్తలు ఇద్దరు సర్పంచ్, ఉప సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లింగోజీ తండా గ్రామానికి చెందిన జాదవ్ మాయ 88 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా గెలుపొందింది. అదే గ్రామ పంచాయతీలో అధిక ఓట్లతో వార్డు సభ్యునిగా జాదవ్ హరి నాయక్ ఎన్నికై ఉప సర్పంచిగా గెలుపొందారు.
జగిత్యాల జిల్లా…..
తిమ్మయ్యపల్లెలో సర్పంచ్ పదవికి తల్లి, కుమార్తె తలపడ్డారు. ఈ గ్రామంలో సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. బీఆర్ఎస్ మద్దతుతో శివరాత్రి గంగవ్వ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి ఆమె కుమార్తె సుమలత పోటీ చేశారు. కాగా తల్లిపై కుమార్తె 91 ఓట్ల మెజార్టీతో గెలిచింది. గతంలో సుమలత ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఇరు కుటంబాల మధ్య వైరం నెలకొంది.
పెద్దపల్లి జిల్లా….
మంథని మండలం కాకర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా పోటీ చేసిన మెండే రాజయ్య, కనవేన కొమురయ్య లకు సమాన ఓట్లు రావడంతోలాటరీ పద్ధతిలో గెలుపు ప్రకటించిన అధికారులు లాటరీ లో గెలిచిన కనవేన కొమురయ్య.





Leave a Reply