
- పది రోజుల్లో వడగళ్ల వర్షాలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
వేసవి ప్రభావం మొదలైంది. భానుడి ప్రతాపం రోజు రోజుకు పెరుగుతోంది.మార్చి మొదటి వారంలోనే వేసవి తాపం 38 డిగ్రీల వరకు నమోదౌతోంది. రాబోయే రెండు నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది వేసవి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరికల సంకేతాలు ఇప్పటికే వాతావరణ నిపుణులు చేస్తున్నారు. ఇదే సమయంలో వెదర్ మెన్ ఓ చల్లని కబురు చెబుతున్నారు.
మార్చి 18 19 తేదీల తర్వాత తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలు ఫిబ్రవరి 23-24 తేదీల్లో కురిసిన వర్షాల కంటే ఎక్కువగా ఉంటాయి, వడగళ్లు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 12 నుండి ఈ వర్షాలకు సంబంధించి స్పష్టమైన నివేదికలు వెల్లడిస్తానన్నారు. మరో వారం రోజుల పాటు పొడి వాతవరణం ఉంటుందని హైదరాబాద్లో 37 డిగ్రీల వరకు ఊష్ణోగ్రతలు నమోదవుతాయని, అదే విధంగా తెలంగాణా తూర్పు ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఊష్ణోగ్రతలు 17వ తేదీ లోపే నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.రాష్ట్రంలోని ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో ఇప్పటికే 39 డిగ్రీల వరకు ఊష్టోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజుల్లో మరో రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.



Leave a Reply