
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాకు కేంద్ర ప్రభుత్వం మరో అమృత్ భారత్ రైలును కేటాయించింది. అమృత్ భారత్ స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్ లతో ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. నాగర్ కోయిల్ నుంచి చర్లపల్లి స్టేషన్ల మధ్య ఈ రైలు త్వరలో ప్రారంభం కానుంది.తమిళనాడు, ఏపీ, తెలంగాణా రాష్ట్రాల ప్రయాణికులకు ఈ రైలు ఎంతో సౌకర్య వంతంగా మారనుంది. త్వరలోనే కొత్త రైలు ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది.


Leave a Reply