NewsInn

News in a Click

భార‌త్ గెలుపుతో పాక్ ప‌రువు తీస్తున్న విశ్లేశ‌కులు

  • కెన్యా, ఉగాండా లతో ఆడి పాక్ నం. 1 కాలేదు.

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ ఇన్‌)

ఐసీసీ టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ లో పాకిస్తాన్ జ‌ట్టు గ్రూప్ ద‌శ దాటిని త‌రువాత ఇంటి మెహం పట్ట‌డంతో పాక్ మాజీ క్రికెట‌ర్లు ఆ జ‌ట్టు ఆట‌తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. అదే స‌మ‌యంలో భార‌త జ‌రిగే ప్ర‌తి మ్యాచ్ కు ముందు భార‌త్ జ‌ట్టు ఓడిపోతుంద‌నే జోస్యం చెబుతూ వ‌చ్చారు. గ్రూప్ ద‌శ‌లో వెస్టీండీస్ తో జ‌రిగిన మ్యాచ్ లో వీండీస్ విజ‌యం ఖాయ‌మ‌ని వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లాండ్ తో సెమీఫైన‌ల్ సంద‌ర్భంగా కూడా సెమిస్ తో నే భార‌త్ ఇంటికి చేరుకుంటుంద‌ని వ్యాఖ్య‌లు చేశారు. న్యూజీలాండ్ తో ఫైన‌ల్ మ్యాచ్ లో కూడా న్యూజీలాండ్ కే విజ‌యాకాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని జోస్యం చెప్పారు. కానీ ఎక్క‌డా పాక్ మాజీ ఆట‌గాళ్ల జోస్యం ఫ‌లించ లేదు. మ‌హ్మ‌ద్ అమీర్, ఇంజమాముల్ హ‌క్ మ‌రో అడుగు ముందు కేసి భార‌త జ‌ట్టు మ్యాచ్ ఫ‌లితం రాబ‌ట్టేందుకు కొత్త దారుల‌ను వెతుక్కుంద‌న్న వాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. కానీ పాక్ మాజీ ఆట‌గాళ్ల వ్యాఖ్య‌లను పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోయినా…..పాకిస్తాన్ ఆటగాళ్ల త‌మ జ‌ట్టు వైఫ్యల్యం పై పోస్టు మార్టం చేయ‌కుండా ఈ టౌర్నిలో భార‌త్ జ‌ట్టు భ‌విష్య‌త్తు గురించి ఎక్కువ‌గా ఆలోచించినట్లు వారి ప్ర‌క‌ట‌న‌ల‌తో స్ప‌ష్టంగా తేలిపోయింది.

అయితే పాక్ మాజీ ఆట‌గాళ్ల జోస్యం ఫ‌లితాలు భిన్నంగా రావ‌డంతో భార‌త జ‌ట్టు విజ‌యాన్ని అందుకోవ‌డంతో ఆ దేశ క్రికెట్ విశ్లేష‌కులు పాకిస్తాన్ క్రికెట్ భ‌విత‌వ్యంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. దేశంలో ట్యాలెంట్ ఉన్న ఆట‌గాళ్లు ఉన్నా…వారిని స‌క్ర‌మంగా వినియోగించుకునే ప‌రిస్థితి లేదంటున్నారు. పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు జింబాబ్వే, కెన్యా, ఉగాండా లాంటి జ‌ట్ల‌తో ఆడుతూ తామే ప్ర‌పంచ క్రికెట్ లో నం.1 అని చెప్పుకునే రోజులు ఎంతో దూరంలో లేవ‌ని ఎద్దేవా చేస్తున్నారు.

టీ.-20 ప్ర‌పంచ క‌ప్ లో రాణించిన సంజు శాంస‌న్, ఇషాన్ కిష‌న్ ల‌కు భార‌త జ‌ట్టు త‌ర‌పున ఎక్కువ‌గా ఆడే అవ‌కాశం కూడా ద‌క్క‌లేద‌ని భార‌త జ‌ట్టులో స్థానం ద‌క్కించుకోవ‌డం దాన్న నిల‌బెట్టు కోవ‌డమే పెద్ద స‌మ‌స్య‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు.అవ‌కాశం రాకున్నా సంజు ఈ టౌర్న‌మెంట్లో అత్య‌త్తుమ ప్ర‌ద‌ర్శ‌న చేసి నిలుపుకున్నార‌ని, ఇషాన్ కిష‌న్ కూడా టౌర్నిమెంట్ ముందు వ‌ర‌కు జ‌ట్టులో లేడ‌న్నారు. కానీ ఇషాన్ కిష‌న్ ప్ర‌తిభ ను గుర్తించి ఆడేందుకు అవ‌కాశం ద‌క్కించుకున్నార‌ని చెప్పారు. అభిషేక్ శ‌ర్మ ఎంతో ప్రెజ‌ర్ లో ఉన్నా జ‌ట్టు న‌మ్మ‌కం ఉంచ‌డంతో ఫైన‌ల్స్ లో రాణించార‌ని ఇలాంటి క్రికెటర్లు భార‌త దేశంలో పెద్దఎత్తున ఉన్నార‌ని భార‌త్ క్రికెటర్ల‌లో ఉన్న ట్యాలెంట్ ను స‌ద్విని యోగం చేసుకున్న వ్య‌వ‌స్థ ఉంద‌ని క్రీడా విశ్లేష‌కులు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *