
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా వంటి రాష్ట్రానికి నేను గవర్నర్ గా రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణా అంటే సాంస్కృతిక సంపద, గొప్పసంప్రదాయాలు,అసాధారణ పురోగతికి నిదర్శనమన్నారు. తెలంగాణా గవర్నర్ గా ప్రమాణా స్వీకారం చేసిన అనంతరం ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పని చేసిన అనుభవం తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగ పడుతుందని భావిస్తున్నానన్నారు. మనమంతా కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను గౌరవిస్తూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా, నేను సమగ్రత, సమైక్యత, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటానన్నారు.నా విధులను న్యాయబద్ధంగా, నిజాయితీగా, భారత రాజ్యాంగానికి అనుగుణంగా అంకితభావంతో నిర్వహిస్తానని చెప్పారు..
గవర్నర్ గా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి శుక్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు.


Leave a Reply