
(మెదక్,న్యూస్ఇన్)
ఉమ్మడి మెదక్ జిల్లాలో వినూత్నమైన రీతిలో ప్రజల్లోకి వెళ్లే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పండగ ఏదైనా ఏర్పాట్లు చేయడం అనవాయితీ గా పెట్టుకున్నారు. దసరా వచ్చిన, క్రిస్మస్ పండగ అయినా, రంజాన్ మాసం అయినా అన్ని మతాలకు అంతే ప్రాధాన్యత ఇస్తూ రాజకీయల్లో తన ముద్ర వేసుకుంటున్నారు. పండగొలొస్తే జగ్గారెడ్డి వైపు చూసే విధంగా పరిస్తితి అక్కడ మారి పోయింది. ఈ వర్గం అయినా…పండగ ఉందంటే జగ్గన్న ఉంటేనే అక్కడ పండగ హడావుడి అన్న చందంగా పరిస్తితి మారిపోయింది. తాజాగా రంజాన్ మాసం కావడంతో…. జగ్గారెడ్డి భారీగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ఈ విందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహా, ఎంపీ సురేష్ షెట్కర్ లు ఈ విందుకు హాజరయ్యారు.

విందుకు హాజరైన నేతలు జగ్గన్న మానవత్వం ఉన్న మనిషి అంటూ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షులు తెలిపారు.






Leave a Reply