NewsInn

News in a Click

తెలంగాణ ప్రజలు మారుతారని ఆశిస్తున్నా: అఖిలేష్ యాదవ్

తెలంగాణ ప్రజలు మారుతారని ఆశిస్తున్నా: అఖిలేష్ యాదవ్

తెలంగాణ ప్రజలు మారుతారని నేను ఆశిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజమే అన్నారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర జాతీయ,రాజకీయాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అఖిలేష్
వీరిని కలిసినప్పుడు సొంత మనిషిలా అనిపిస్తుందన్నారు.రాజకీయాల్లో ప్రజలు ఒక్కోసారి స్వీకరిస్తారు, ఒక్కోసారి మనం విషయాలను పునఃపరిశీలించుకునే అవకాశాన్ని ఇస్తారు. మేము లోపల మాట్లాడుకుంటున్నప్పుడు అదే చర్చించాము…

ఒకప్పుడు మేము చాలా తక్కువ సీట్లు గెలిచాము. కానీ అదే ప్రజలు మా వెంట నిలిచారు.ఇప్పుడు అక్కడ బీజేపీ రెండో స్థానంలో ఉంది.మనం ప్రజల వెంట నిలబడినప్పుడు ఏదో ఒక రోజు ప్రజలే మన పార్టీల వెంట నిలబడతారు అండగా ఉంటారని అఖిలేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.దేశానికి ప్రగతిశీల మార్గంలో వెళ్ళే అవసరం ఉంది.
ఒక విజన్ తో ముందుకు వెళ్ళాలి. విభజన రాజకీయాలు అంతం కావాలి. అదే దిశలో పని చేయడానికి మా ప్రయత్నం ఉంటుంది. నేను కేసీఆర్ తో కూడా మాట్లాడాను. నేను చాలా త్వరలో వచ్చి వారిని కలుస్తాను.

మాకు అఖిలేష్ యాదవ్ స్ఫూర్తి: కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో తమ పార్టీకి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పార్టీనే స్పూర్తి అని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఒకప్పుడు శాసనసభలో అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్లో తక్కువ సీట్లు సాధించిన ప్రజల వెంబటి నిలబడినందుకు అఖిలేష్ యాదవ్ పార్టీ ఇప్పుడు 37 మంది ఎంపీలను గెలిపించుకొని దేశంలోని మూడవ అతిపెద్ద పార్టీగా నిలిచిందని కేటీఆర్ వ్యాఖ్యాతించారు.అఖిలేష్ యాదవ్ పార్టీ స్ఫూర్తితో మా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో ముందుకు సాగుతుందన్నారు.ప్రజల వెంట నిలబడి మరోసారి తప్పకుండా ప్రజల ఆశీర్వాదాలు పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాము, మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *