ఐటీ రంగంలో స్టార్టప్ కంపెనీలను అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ప్రోత్సహించడం అభినందనీయం అని పలువురు ఐటీ రంగ ప్రముఖులు వ్యాఖ్యానించారు.శనివారం అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఆటా –22025 వేడుకల్లో భాగంగా ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్, IIT హైదరాబాద్ సహకారంతో ఐఐటీ క్యాంపస్లో ఆటా స్టార్టప్ పిచ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ స్టార్టప్లకు నిధుల అవకాశాలు, మెంటార్షిప్, పరిశ్రమల అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ఈ పిచ్ డే నిర్వహించామని ఆటా ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలు, ఐటీ రంగ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. స్టార్టప్లను ప్రోత్సహించడం, వాటికి నిధులు, దిశ నిర్దేశం అందించడం, గ్లోబల్ నెట్వర్క్ను నిర్మించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయంరెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు
దేశంలో స్టార్టప్ ఎకోసిస్టం వేగంగా విస్తరిస్తోందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, మైతీ స్టార్టప్ హబ్ అందిస్తున్న సహకారం వల్ల యువ ఇంజనీర్లకు అనేక అవకాశాలు లభిస్తున్నాయని మైతీ స్టార్టప్ హబ్ సీఈఓ డా. పన్నీర్ సెల్వం మదనగోపాల్ పేర్కొన్నారు. స్టార్టప్లు ఎదగడంలో ఎదురయ్యే సవాళ్లు, పెట్టుబడుల సమీకరణ, మార్కెట్ విస్తరణ, టెక్నాలజీ వాణిజ్యయీకరణ, గ్లోబల్ భాగస్వామ్యాలపై వారి అభిప్రాయాలను ప్రతినిధులు వివరించారు. అలాగే పిచ్ డేలో పాల్గొన్న స్టార్టప్లు తమ వ్యాపార ఆలోచనలు, ఉత్పత్తులు, సేవలను కాంపిటీషన్ న్యాయనిర్ణేతలు పరీక్షించి, ఉత్తమ స్టార్టప్లను.ఎంపిక చేశారు.






Leave a Reply