NewsInn

News in a Click

బీజేపీని ఏ ఐ సహకారంతో ఓడిస్తాం

బీజేపీని ఏ ఐ సహకారంతో ఓడిస్తాం

విభజన రాజకీయాలకు మేము వ్యతిరేకం

బీజేపీ గెలవడానికే ఎస్ఐఆర్ghhh

ఇండియా కూటమిలో కొనసాగుతాం

సీఎం అఖిలేష్ యాదవ్

(హైదరాబాద్,న్యూస్ఇన్)

ఉత్తర ప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని బీజేపీ పార్టీని ఓడిస్తామని మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. తాము విభజన రాజకీయాలకు వ్యతిరేకమని, దానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విజన్ ఇండియా ద్వారా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. సానుకూల, అభివృద్ది, ప్రగతిశీల రాజకీయాలే చేస్తామని తెలిపారు.సమాజ్ వాది పార్టీ అధ్యర్యంలో శనివారం హైదరాబాద్ లో జరిగిన విజన్ ఇండియా సమ్మిట్ లో ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.పరిపాలనలో సాంకేతికత వినియోగం, భవిష్యత్తులో సాంకేతికత రూపాంతరం వంటి అంశాలపై యువతలో అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అన్ని ప్రధాన పట్టణాల్లో విజన్ ఇండియా సమ్మిట్ లను నిర్వహిస్తోందన్నారు.

ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… ఉత్తర ప్రదేశ్ లో దాదాపు 25 కోట్ల జనాభా ఉందని ప్రభుత్వం చెబుతోందని, ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ ప్రభుత్వం సుమారు 3 కోట్ల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల అనేక ఓట్లు పోతున్నాయని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గెలవడానికే బీజేపీ ఎస్ఐఆర్ చేపడుతోందని ఆరోపించారు. ఇది ఎస్ఐఆర్ కాదని, ఇది జాతీయ పౌరుల నమోదు (ఎన్ఆర్సీ) ప్రక్రియ అని విమర్శించారు. ఎన్ఆర్సీని నేరుగా చేపట్టలేక ప్రభుత్వం ఎస్ఐఆర్ ను వాడుకుంటున్నదని, ఎన్ఆర్సీకి ఎన్ని పత్రాలు అడుగుతారో ఎస్ఐఆర్ కి అన్ని పత్రాలు అడుగుతున్నారని అన్నారు. బూత్ స్థాయి అధికారులకు కూడా శిక్షణ ఇవ్వలేదని, దీంతో క్షేత్ర స్థాయిలో అనేక సవాళ్లు, సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఓటు హక్కు కల్పించడం ఎన్నికల సంఘం బాధ్యత కానీ ఓట్లు తొలగించడం కాదన్నారు. బీహార్ ఫలితాలు మంచి అనుభవాన్ని ఇవ్వలేదని అయినా…. తాము ఇండియా కూటమిలోనే కొనసాగుతమని ప్రకటించారు.

రాష్ట్రంలో పర్యటిస్తున్న అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో పాటు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నేతలను కలుసుకోవడంపై స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు పాత స్నేహితులు అయితే…. రేవంత్ రెడ్డి కొత్త స్నేహితుడని చెప్పారు. కొత్త మిత్రులు కలిసినంత మాత్రాన పాత వారిని విడిచి పెడతామా అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *