NewsInn

News in a Click

రామేశ్వరం కేఫ్‌లో అఖిలేష్, కేటీఆర్ లు

రామేశ్వరం కేఫ్‌లో అఖిలేష్, కేటీఆర్ లు

కేఫ్ రుచులను ఆస్వాదించిన నేతలు

దక్షిణాది రుచులుకు అఖిలేష్ ఫిదా

యజమాని శరత్‌ను అభినందించిన అఖిలేష్

(హైదరాబాద్,న్యూస్ ఇన్)

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని ప్రముఖ ‘రామేశ్వరం కేఫ్‌’లో మధ్యాహ్న భోజనం చేశారు. నగరంలో ఎంతో ఆదరణ పొందిన రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో, కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచులను ఆస్వాదిస్తూనే.. పలు రాజకీయ అంశాలపై కాసేపు ముచ్చటించారు.

వీరి రాక సందర్భంగా రామేశ్వరం కేఫ్ యజమాని శరత్ ఇరువురు నేతలకు ఘన స్వాగతం పలికి తగిన ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేష్ యాదవ్.. వాటి నాణ్యతను, రుచిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లోనూ రామేశ్వరం కేఫ్‌ను ఇంత విజయవంతంగా నడుపుతుండటం పట్ల యజమాని శరత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు అఖిలేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *