
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాలో డ్రైవింగ్ లైసన్స్ పొందడం ఇక అంత సలువు కాదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చే కొత్త విధానంలో డ్రైవింగ్ లైసన్స్ పొందాలంటే మరింత కఠినంగా నిబంధనలు అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం పొందుతున్న విధానం కంటే మరో పరీక్షను అదనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కొత్త పద్దతిని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఆదేశాల్లో వెల్లడించింది. కొత్త విధానం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని రవాణా శాఖ కూడా భావిస్తోంది.
పాత విధానానికి అదనం….
ప్రస్తుత విధానం ప్రకారం ముందుగా లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్(LLR) పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ టెస్ట్ ఉంటుంది. ఇది పాస్ అయిన వెంటనే మీకు ఎల్ఎల్ఆర్ జారీ చేస్తారు. ట్రాఫిక్ రూల్స్, నిబంధనల గురించి ఈ టెస్టులో ప్రశ్నలు అడుగుతారు. ఎల్ఎల్ఆర్ ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ఆరు నెలల్లోపు మీరు డ్రైవింగ్ టెస్ట్కు హాజరుకావాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే మీ డ్రైవింగ్ను పరిక్షించేందుకు టెస్ట్ నిర్వహిస్తారు. అందులోనూ మీరు క్వాలిఫై అయితే డ్రైవింగ్ లైసెన్స్ రవాణాశాఖ జారీ చేస్తుంది. అయితే ఇక నుంచి ఈ రెండు టెస్టులతో పాటు మూడో టెస్టు కూడా నిర్వహిస్తారు.
మరో పరీక్షలో ఏముంటుంది….
ఇందులో భాగంగా ఆన్ లైన్ రోడ్ సేఫ్టీ అవేర్ నెస్ మాడ్యూల్స్ ను పరీక్షిస్తారు. ఈ పరీక్షా సమయం 3 గంటలు ఇది మొత్తం ఆన్ లైన్ లోనే ఉంటుంది. ఈ టెస్ట్ లో ఆరు మాడ్యుళ్లు ఉంటాయి. ఒక్కో మాడ్యూల్ కు 30 నిమిషాలు సమయం కేటాయిస్తారు. డ్రైవింగ్ లైసన్స్ కు దరఖాస్తు చేసుకున్న తరువాత ముందుగా ఈ పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చే సర్టి ఫికెట్ ఆధారంగా లర్నింగ్ లైసన్స్కు దరఖాస్తు చేయాలి….. ఇక ఇక్కడి నుంచి మళ్లీ పాత పద్ధతే అమలు చేస్తూ డ్రైవింగ్ లైసన్స్ లు జారీ చేస్తారు.






Leave a Reply