NewsInn

News in a Click

మూసీ పున‌రుజ్జీవంపై వెనుక‌డుగు వేయం

మూసీ పున‌రుజ్జీవంపై వెనుక‌డుగు వేయం
  • సీఎం రేవంత్ రెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ప్ర‌భుత్వం తీసుకున్న మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టుపై వెనుక‌డుగు వేసేది లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి మ‌రో సారి స్ప‌ష్టం చేశారు. మూసీ నిర్వాసితుల‌ను అన్ని ర‌కాలుగా ఆదుకుంటామ‌ని, వారికి అన్యాయం చేయ‌మ‌న్నారు. మూసీ నిర్వాసితులు కూడా రాజ‌కీయ పార్టీల ఉచ్చులో ప‌డ‌కుండా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. ప్ర‌భుత్వం మూసీ నిర్వాసితుల‌ను ఆదుకునేందుకు సిద్దంగా ఉంద‌ని ఎవ‌రికీ అనుమానాలు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.శాస‌న‌మండ‌లిలో హైద‌రాబాద్ అభివృద్ధి గురించి సీఎం మాట్లాడారు. దేశంలో ఎన్నో న‌గ‌రాలున్నా ఢిల్లీ,ముంబాయి, బెంగుళూరు, చెన్నై, హైద‌రాబాద్ న‌గ‌రాల‌పైనే అంద‌రి దృష్టి ఉంటుంద‌న్నారు. వీటిలో కూడా ఒక్కో న‌గ‌రానికి ఒక్కో ప్ర‌ధాన స‌మ‌స్య వెంటాడుతోంద‌న్నారు.

ఢిల్లీకి కాలుశ్యం, బెంగుళూరుకు ట్రాఫిక్, ముంబాయికి, చెన్నైల‌కు వ‌రద‌లు నీటి స‌మ‌స్య వెంటాడుతున్నాయ‌న్నారు. హైద‌రాబాద్ అంద‌రికీ ఆమోద యోగ్యంగా ఉంద‌న్నారు. ఈ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని విజ‌న్ 2047 తో ముందుకు వెళుతున్న‌ట్లు సీఎం చెప్పారు. న‌గ‌రంలోని కాలుష్య కారక పరిశ్రమలకు ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తే… మధ్యతరగతికి భూమి అందుబాటులోకి వస్తుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ప్రణాళికలు తీసుకున్నామ‌న్నారు. మెట్రోను స్వాధీనం చేసుకుని విస్త‌రించే ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. న‌గ‌రంలో ఫుట్ పాత్ ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి పాదాచారులు న‌డించేందుకు అనుగుణంగా చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు.ఫుట్ పాత్ వ్యాపారుల‌పై స్థలాన్ని కేటాయించి అక్క‌డ వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్స‌హిస్తామ‌న్నారు. హైద‌రాబాద్ అభివృద్ధి విష‌యంలో బీఆర్ ఎస్ రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని, అభివృద్ధికి సూచ‌న‌లు ఇస్తే వాటిని ప‌రిశీలించి అమ‌లు చేస్తామ‌ని సీఎం వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *