
(హైదరాబాద్,న్యూస్ఇన్)
యుద్ధవాతావరణం నేపత్యంలో రాష్ట్రంలో ఏర్పడిన గ్యాస్ కొరతపై బీఆర్ ఎస్ నిరసన వ్యక్తం చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ముందు గన్ పార్క్ దగ్గర పార్ట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్ం చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరతపై వాస్తవాలు ప్రజలకు వివరించాలన్నారు. ప్ల కార్డులతో నిగన్ పార్క్ వద్ద గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మాట్లాడుతూ…కేంద్రప్రభుత్వం కొరత లేదని ప్రజలకు నమ్మబలుకుతోందని, క్షేత్ర స్థాయిలో మాత్రం గ్యాస్ కొరత తీవ్రంగా ఉందన్నారు.తామేమీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది… భవిష్యత్తులో ఫ్యూచర్లో గ్యాస్ సిలిండర్ సైజ్ తగ్గిస్తారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. 14 కిలోల గ్యాస్ ను రాబోయే రోజుల్లో 10 కిలోలకు తగ్గిస్తారని ప్రచారం మొదలైందని చెప్పారు. కొరత లేదని కేంద్రం, సరఫరా లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతున్నాయని ఆరోపించారు.







Leave a Reply