NewsInn

News in a Click

రాష్ట్రంలో బార్ ల కంటే….. బెల్ట్ షాప్ లే బెట‌ర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణాలో బార్ రెస్టారెంట్ల యాజ‌మానులు ప్ర‌భుత్వ‌తీరును త‌ప్పు బ‌డుతున్నారు. ప్ర‌భుత్వ తీరు ఇదే విధంగా ఉంటే తాము బార్ ల‌ను మూసి బెల్టు షాపులు న‌డుపుకోవ‌డ‌మే మంచిద‌నిపిస్తోంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం తెచ్చిన 145 జీఓ ద్వారా వైన్ షాప్ ల దగ్గర ప‌ర్మిట్ రూంల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో త‌మ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌న్నారు. అబ్కారీ భ‌వ‌న్ వ‌ద్ద బార్ అసోసియేష‌న్ మౌన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఈ సంద‌ర్భంగా అసోసియేష‌న్ ప్ర‌తినిధులు మాట్లాడుతూ ప్ర‌భుత్వంప‌ర్మిట్ రూంల‌ను నిబంధ‌న‌ల మేర‌కు న‌డ‌పించాల‌ని ప్ర‌భుత్వాన్నికోరారు. ప్ర‌భుత్వానికి భారీగా ఆదాయాన్ని ఇస్తున్న త‌మ డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు వ‌ర‌కు శాంతి యుతంగా తాము మౌన దీక్ష చేస్తామ‌ని తెలంగాణా బార్ అసోసియేష‌న్ వెల్ల‌డించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *