(హైదరాబాద్,న్యూస్ఇన్)ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల క్రితం నర్మెట్ట పాం అయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్బంగా సిద్దిపేట నుంచి హరీష్ రావు పై ఎవరు గెలిచినా వారికి మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు సిద్దిపేటలో ఒకే కుటుంబానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం ప్రజలు కల్పిస్తున్నారని, ఒక్క సారి ఇతరులకు అవకాశం ఇస్తే మార్పు చూస్తారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావ్ స్పందించారు. అసెంబ్లీ మీడియాతో ఇష్టా గోష్టిగా ఆయన మాట్లాడారు. ఎవరినో పోటీ చేయించకంటే సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు. మూడో వ్యక్తి అక్కడ ఎందుకు అని ప్రశ్నించారు. సీఎం గా రేవంత్ రెడ్డి అక్కడ పోటీ చేసేందుకు ముందుకు రావాలన్నారు. బీఆర్ ఎస్ పార్టీకి ఎప్పుడు గోల్ కోట్టాలో తెలుసని, వచ్చే సారి ఖచ్చితంగా బీఆర్ ఎస్ రాష్ట్రంలో అధికారం దక్కించు కుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి ముఖ్యమంత్రిగా కేసిఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విపలమైందని హరీష్ రావ్ ఆరోపించారు. ఆరు గ్యారెంటీల అమలు కాకపోవడంతోనే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా తాము చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 16 నోటిపికేషన్లు ఇచ్చి 16,978 ఉద్యోగాలు భర్తీ చేశామని కేటిఆర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయాన్ని హరీష్ రవ్ గుర్తించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో కేవలం రెండు శాతం మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. శాసనసభా నిర్వహణలో సభా నియమాలను పూర్తిగా ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన చేయడాన్ని స్వాగతిస్తామని, అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగరాదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ఎమన్నారో తెలుసా……..
‘






Leave a Reply