- గుట్టు రట్టు చేసిన పోలీసులు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
దేశంలో ఉగ్రవాద అలజడి ఎక్కడా రేగినా…హైదరాబాద్ వైపు వేలు చూపిస్తాయన్నది రాజకీయ విమర్శ…కానీ గత కొన్నేళ్లుగా ఇదే నిజం అవుతోంది. తాజాగా విజయవాడంలో తీగ లాగితే హైదరాబాద్ లో కిలాడీ లేడీ విషయం వెలుగు చూసింది.ఉగ్రవాదం వైపు ఉసి గొల్పే విధంగా నెట్ వర్క్ ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ మహిళ కీలక పాత్ర పోషించిందని పోలీసులు గుర్తించారు. కౌంటర్ ఇంటలీజెన్స్ పోలీసులు విజయవాడంలో ముగ్గురిని ముందుగా అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ జరిపితే హైదరాబాద్ కిలాడీ లేడీ గురించి సమచారం వెలుగు చూసింది. ఈ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ దైన శైలిలో విచారణ జరుపడంతో అసలు గుట్టు రట్టయింది.



తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ముందుగా కౌంటర్ ఇంటలీజెన్స్ అధికారుల అనుమానాలతో విజయవాడలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఈ నెట్ వర్క్ పెద్దగా ఉందని గుర్తించడంతో పోలీసులకే నివ్వెర పోయేలా వాస్తవాలు బయటకు వచ్చాయి. నెట్వర్క్ ఏర్పాటులో హైదరాబాద్ కు చెందిన కీలాడి లేడి అయేషా బేగం అలియాస్ సైదా బేగం ఈ ముఠాను నడిపించిందని తేలింది. ఈ ఘటన దేశంలోనే సంచలనం సృష్టించింది. ఓ మహిళా ఉగ్రవాదంపూ యువకులను రెచ్చగొట్టేలా సైలెంట్ పనులు చక్కబెట్టడంతో పోలీసులు కూడా ముందుగా ఆశ్చర్య పోయారు. దేశ వ్యాప్తంగా యువతను ఆకర్షించేలా ప్రణాళికలు రచించడంలో సైదా బేగం కీలక పాత్ర పోషించిందని పోలీసులు గుర్తించారు. మల్లేపల్లికి చెందిన అయేషా విదేశీ హ్యాండ్లర్ అల్ హకీమ్ షూకుర్ ద్వారా ఉగ్రవాద భావజాలంవైపు ఆకర్షితులయ్యారు.
హైదరాబాద్ టూ ఆల్ ఇండియా టెర్రర్ గ్రూప్స్….
ఆ తరువాత దేశంలో యువతను ఆకర్షించే బాధ్యతను విదేశీ హ్యాండ్లర్ అయేషాకు అప్పచెప్పడంతో….. వివిధ రాష్ట్రాల్లో కొత్తగా నెట్ వర్క్ ను ఏర్పాటు చేసింది. తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 40 మందికి పైగా యువకులతో అయేషా గ్రూపు మొదలు పెట్టింది.వీరి ద్వారా భారత దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా లో ప్రచారం చేయించడం స్టార్ట్ చేసింది. దేశానికి వ్యతిరేకంగా తీవ్ర వాద భావజాలం వైపు వారిని మళ్లించడంలో కీలక పాత్ర పోషించింది. సోహైల్ బెగ్, షరీఫ్, డానిష్ వంటి యువకులను నిషేధిత ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా పనిచేసేలా ఈమె మార్గనిర్దేశం చేసింది. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
దేశవ్యాప్తంగా గాలింపు….
ప్రస్తుతం ఆయేషా బేగంను విజయవాడ టూటౌన్ పోలీస్ స్టేషన్లో అధికారులు విచారిస్తున్నారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా 9 ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దించారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో స్థానిక పోలీసుల సాయంతో సోదాలు కొనసాగుతున్నాయి.
రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు….
నిందితుడు మీర్జా సోహైల్ బేగ్ (A3) సోషల్ మీడియా ద్వారా అల్-హకీమ్ షుకూర్ అనే విదేశీ హ్యాండ్లర్తో నిరంతరం టచ్లో ఉన్నాడు.
AQIS అనుబంధం గా నిషేధిత ఉగ్రవాద సంస్థ AQIS (Al-Qaeda in the Indian Subcontinent) కు అనుబంధంగా జిహాదీ కార్యకలాపాలలో వీరు పాల్గొంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
BENX COM గ్రూపు: రాడికలైజ్ చేయబడిన సభ్యులతో కూడిన “BENX COM” అనే గ్రూపులో చేరి కార్యకలాపాలు సాగించాలని హ్యాండ్లర్ వీరికి సూచించినట్లు తేలింది.
13 మందిపై పోలీసులు కేసు నమోదు…
మీర్జా సోహైల్ బేగ్ – హైదరాబాద్
షాద్మాన్ దిల్కాష్ – బీహార్
సయీదా బేగం – హైదరాబాద్
అల్ హకీమ్ షుకూర్ – విదేశి హ్యాండ్లర్
లక్కీ అహ్మద్ – ఢిల్లీ
అబ్దుల్ సలాం – కర్ణాటక
షారక్ ఖాన్, షేక్ ఫీజర్ – మహారాష్ట్ర







Leave a Reply