

(హైదరాబాద్,న్యూస్ఇన్)
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఇప్పు పువ్వు సారాయి తేవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శాసనసభలో కూడా అదే డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఎప్పటి నుంచే ఇప్ప పువ్వు సారాయి ని వినియోగించుకుని తమ ఆరోగ్యాలను కాపాడుకున్నారని, ఇదే సమయంలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్తకొత్త మద్యం వినియోగం పెరగడంతో ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయన్నారు. ఇప్పపువ్వు సారాయిని పలు రాష్ట్రాల్లో అధికారికంగానే వినయోగం జరుగుతోందని చెప్పారు. తద్వారా గిరిజనులకు ఉపాధి లభిస్తుందన్నారు. గిరిజన ప్రాంతాల నుంచి సేకరించే ఇప్పు పువ్వు తో తయారు చేసిన సారాయిని కొత్త కొత్త పేర్లతో వినియోగం లోకి తెస్తూ భారీగా ఇతర దేశాలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఇప్పుపువ్వు సారాయిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఈ విషయంపై వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్రంలో ఇప్ప పువ్వు సారాయి సరఫరా మొదలు పెట్టినా….దయచేసి ఇందిరమ్మ పేరు ఆ పథకానికి పెట్టవద్దని కోరారు. దీంతోశాసనసభలో సభ్యులంతా కొద్దిసేపు నవ్వుకున్నారు.






Leave a Reply