NewsInn

News in a Click

కోడంగ‌ల్ లో కీచక టీచర్ – భాగోతం…..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హించే కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కీచ‌క టీచ‌ర్ భాగోతం వెలుగు చూసింది. మ‌ద్దూరు మండ‌లం మోమినాపూర్ గ్రామంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఓ విద్యార్థినితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన వీడియో వెలుగులోకి వ‌చ్చింది. ఈ నెల 7వ తేదీన ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు సీసీ కెమ‌రాలో రికార్డు అయిన దృష్యాల‌తో తెలుస్తోంది. ఆ రోజు కంప్యూట‌ర్ క్లాస్ అంటూ ల్యాబ్ కు విద్యార్థిని పిలిపించుకుని ఆ ఉపాధ్య‌యుడు వెకిలి చేష్టల‌కు పాల్ప‌డ్డారు. ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యుడు, గ్రామ పెద్ద‌లు ప్ర‌య‌త్నించినా అది సాధ్యం కాలేదు. విద్యార్థినితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన టీచ‌ర్ పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.విద్యాబుద్ధ‌లు నేర్పించాల్సిన ఉపాధ్య‌యుడు విద్యార్థినిల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్థించ‌డాన్ని త‌ప్పు బ‌డుతున్నారు. ఆ ఉపాధ్యాయుడిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *