- 144.244 మిలియన్ టన్నుల సరఫరా
(హైదరాబాద్,న్యూస్ఇన్)
దక్షిణ మధ్య రైల్వే ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో 144.244 మిలియన్ టన్నుల (ఎమ్.టిలు) సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించింది. ఇది సరుకు రవాణా విభాగంలో కొత్త రికార్డుగా నిలువనుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన అత్యుత్తమ లోడింగ్ అయిన 144.14 మిలియన్ టన్నులను ఈ ఆర్ధిక సంవత్సరం అధిగమించింది. సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాల నుండి బొగ్గు, సిమెంట్ రవాణా రంగంలో కీలక పాత్ర పోషించింది. సాంప్రదాయ సరుకులతో పాటు ఇతర సరుకులను కూడా గుర్తించి, పోర్ట్ లోడింగ్పై దృష్టి సారించడంలో జోన్ చేసిన ప్రయత్నాలు విజయవంతం కావడంతో సరుకు రవాణా ద్వారా భారీగా ఆదాయాన్ని కూడా దక్షణ మధ్య రైల్వే ఆదాయాన్ని ఆర్జించింది. సరుకు రవాణాలో రికార్డు సృష్టించిన సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు.
రైల్వేల్లో టికెట్ లేని ప్రయాణాలు……
దక్షిణ మధ్య రైల్వే రవాణా వివరాలు…..

• రవాణా వ్యవస్థలో ప్రధాన వస్తువు అయిన బొగ్గు- 66.878 మిలియన్ టన్నులు
• సిమెంట్- 37.572 మిలియన్ టన్నులు
• ఇనుప ఖనిజం- 8.620 మిలియన్ టన్నులు
• ఎరువులు- 8.038 మిలియన్ టన్నులు
• ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు-4.810 మిలియన్ టన్నులు
• ఆహార ధాన్యాలు- 6.225 మిలియన్ టన్నులు
• కంటైనర్లు- 2.561 మిలియన్ టన్నులు
• పెట్రోలియం ఉత్పత్తులు(పెట్రోలియం ఆయిల్) -1.223 మిలియన్ టన్నులు
• ఇతర వస్తువులు- 8.349 మిలియన్ టన్నులు: మొత్తంగా 144.244 మిలియన్ టన్నులు











Leave a Reply