NewsInn

News in a Click

తెలుగు రాష్ట్రాల‌పై వ‌డ‌గాలుల ఎఫెక్ట్……!

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

వేస‌వి ప్ర‌తాపం మొద‌లు కానుంది. మ‌రో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వ‌డ‌గాల్పులు మొద‌లు కానున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. గ‌త వారం రోజులుగా తీవ్రంగా ఉన్న ఎండ‌లు ఏప్రిల్, మే నెలలో గ‌రిష్ట స్థాయికి ఊష్ణోగ్ర‌త‌లు చేస‌రుకునే అవ‌కాశం ఉంది. ఇప్పటికే ప‌లు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. రాబోయే 50 రోజుల పాటు వేస‌వి తీవ్రరూపం దాల్చే అవ‌కాశాలున్నాయ‌ని వాతావ‌ర‌ణ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ప‌దిరోజుల స‌మ‌యంలోనే దాదాపు 45 డిగ్రీవ‌ల వ‌ర‌కు ఊష్ణోగ్ర‌తలు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో కూడా 40 డిగ్రీల ఊష్ణోగ్ర‌త‌లు దాటే అవ‌కాశం ఉందిని వాతావ‌ర‌ణ శాఖ చెబుతోంది.

ఏప్రిల్ 12వ తేదీ నుంచి 22వ తేదీ వ‌ర‌కు వాతావ‌ర‌ణం పొడిగా ఉంటుంద‌ని, ఇదే స‌మ‌యంలో వడ‌గాలుల ప్ర‌భావం కూడా తీవ్రంగా ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిస్తోంది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న సూచ‌న‌లు చేస్తోంది. వేస‌వి బారిన ప‌డ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచిస్తోంది. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ఉద‌యం 11 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఎండ‌, వ‌డ‌గాలులు వీచే అవ‌కాశం ఉంటుంద‌ని, ఆ స‌మ‌యంలో అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని, శ‌రీరానికి స‌రిప‌డా నీటిని సేవించాల‌ని సూచ‌న‌లు వాతావ‌ర‌ణ శాఖ సూచిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *