(న్యూస్ఇన్,హైదరాబాద్)
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైల్లు నడిపించాలని నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను చర్లపల్లి నుంచి దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తోంది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నా……
చర్లపల్లి – సంత్రాగచి (06 సర్వీసులు): చర్లపల్లి – సంత్రాగచి(రైలు నంబరు 07517 ) ఏప్రిల్ 15, 19 ,23 తేదీల్లో ప్రత్యేక రైలుంటాయి. ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 14:30 గంటలకు సంత్రాగచికి చేరుకుంటుంది.

సంత్రాగచి – చర్లపల్లి(రైలు నంబరు 07518 ) మధ్య ఏప్రిల్ 16, 20 ,24 తేదీల్లో కూడా స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. సాయంత్రం 16:45 గంటలకు సంత్రాగచి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 22:00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు…. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్ ఖరగ్పూర్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
తాంబరం – న్యూ తిన్సుకియా (06 సర్వీసులు): తాంబరం – న్యూ తిన్సుకియా(రైలు నంబరు 06015) మధ్య ఏప్రిల్ 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లుంటాయి. ఉదయం 10:15 గంటలకు బయలుదేరి 3వ రోజు తెల్లవారుజామున 04:30 గంటలకు న్యూ తిన్సుకియాకు చేరుకుంటుంది.
న్యూ తిన్సుకియా – తాంబరం(రైలు నంబరు 06016 ) మధ్య ఏప్రిల్ 16, 23, 30 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి. రాత్రి 20:00 గంటలకు బయలుదేరి 3వ రోజు సాయంత్రం 16:00 గంటలకు తాంబరం చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు చెన్నై ఎగ్మోర్, సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, ఖరగ్పూర్, డాన్కుని, బర్ధమాన్, రాంపూర్ హాట్, మాల్దా టౌన్, బార్సోయ్, కిషన్ గంజ్, న్యూ జల్పైగురి, న్యూ బొంగైగావ్, రంగియా, గువహటి, చాపర్ముఖ్, లమ్డింగ్, డిఫు, దిమాపూర్, ఫుర్కాటింగ్ స్టేషన్లలో ఆగుతాయి.
సరుకు రవాణాతో భారీగా ఆదాయం…..
ఈ రైళ్లలో కేవలం స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకోవాలని కోరింది.










Leave a Reply