NewsInn

News in a Click

LSG VS GT మ్యాచ్ – గుజరాత్ టైట‌న్స్ విజ‌యం

LSG VS GT మ్యాచ్ – గుజరాత్ టైట‌న్స్ విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్‌)

గుజరాత్ టైట‌న్స్ ల‌క్నో జెంట్స్ పై ఆడుతూ పాడుతూ విజ‌యం సాధించింది. కెప్ట‌న్ శుభ్ మ‌న్ గిల్ ఇన్నింగ్స్ తో జీటీ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. 166 ప‌రుగ‌ల విజ‌య ల‌క్ష్యంగా ఇన్నింగ్స్ ను జీటీ మొద‌లు పెట్టింది. గిల్, సాయి సుద‌ర్శ‌న్ ప్రారంభించారు. ప‌వ‌ర్ ప్లేలో జీటీ బ్యాట‌ర్లు 9 ప‌రుగ‌ల స‌గ‌టుతో ప‌రుగులు సాధించారు. 5 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోకుండా 45 ప‌రుగు చేశారు. 6వ ఓవ‌ర్ తొలి బంతికే సాయి సుద‌ర్శ‌న్ 15 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. మ‌రోసారి భారీ స్కోరు చేయ‌కుండా సుద‌ర్శ‌న్ నిరాశ ప‌రిచారు. మ‌రో వైపు శుభ్ మ‌న్ గిల్ బాధ్య‌తాయుతంగా బ్యాటింగ్ చేస్తూ….స్కోరును ముందుకు తీసుకెళ్లారు. గిల్- జోస్ బ‌ట్ల‌ర్ మ‌ధ్య భారీ భౄగ‌స్వామ్యం న‌మోదు కావడంతో జీటీ విజ‌యానికి చేరువైంది. గిల్ 40 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, సిక్స్ స‌హాయంతో అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేసుకుని 56 ప‌రుగులు చేసి ఔట‌య్యారు.

14.5 ఓవ‌ర్ల వ‌ద్ద గిల్ వికెట్ జీటీ కోల్పోయింది. జోస్ బ‌ట్ల‌ర్ క్రీజులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ఎల్ ఎస్ జీ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. 37 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లతో 60 ప‌రుగులు చేసి శ‌మి బౌలింగ్ లో బౌండ‌రీ లైన్ ద‌గ్గ‌ర క్యాచ్ ఇచ్చి 135 ప‌రుగ‌ల స్కోరు వ‌ద్ద వెనుదిరిగారు. ఆ త‌రువాత వాషింగ్ట‌న్ సుంద‌ర్, తేవాటియా గెలుపు లాంఛ‌నాన్ని పూర్తి చేశారు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ 21 ప‌రుగుల‌తో, రాహూల్ తేవాటియా 10 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు. 18.4 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 165 ప‌రుగులు చేసి విజ‌యం ద‌క్కించుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెంట్స్ బ్యాట‌ర్లు ప‌రుగులు సాధించేందుకు తీవ్రంగా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 164 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఈ జ‌ట్టులో ఎయిడెన్ మార్క‌ర‌మ్ చేసిన 30 ప‌రుగులే అత్య‌ధిక స్కోరు. స్టార్లు బ్యాట‌ర్లు జ‌ట్టులో ఉన్న త‌డ‌బ‌డుతూనే ఎల్ఎస్ జీ ఇన్నింగ్స్ మొద‌లైంది. ప‌వ‌ర్ ప్లేలోనే కీల‌క వికెట్లు కోల్పోవ‌డంతో భారీ స్కోరు ఈజ‌ట్టు చేయ‌లేక పోయింది.4.1 ఓవ‌ర్ల‌లో 45 ప‌రుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్ఓ ను మిచెల్ మార్ష్ రూపంలో 14 ప‌రుగ‌ల వ‌ద్ద కోల్పోయింది. రెండో వికెట్ రిష‌బ్ పంత్ రూపంలో జ‌ట్టు కోల్పోయింది. జ‌ట్టు స్కోరు 7 ఓవ‌ర్ల‌లో 69 ప‌రుగులకు చేరుకుంది. ర‌న్ రేట్ పెంచేందుకు ప్ర‌య‌త్నించి మార్క‌రమ్ కూడా ఇక్క‌డ ఔట‌య్యారు. ఆ త‌రువాత వ‌రుస‌గా 79 ప‌రుగ‌ల వ‌ద్ద ఆయూష్ బ‌దాని వికెట్ కోల్పోయింది. క్రీజులో నికోల‌స్ పూర‌న్ ఉండ‌డంతో భారీ స్కోరు సాధించే అవ‌కాశాలున్నా…పూర‌న్ కూడా రాణించ‌లేదు. 19 ప‌రుగులు చేసి ఓటౌయ్యారు. గ‌త మ్యాచ్ లో ల‌క్సోసూప‌ర్ జెంట్స్ కు విజ‌యాన్ని అందించిన ముకుల్ చౌద‌రీ కూడా 18 ప‌రుగులు చేసి వెనుదిర‌గ‌డంతో..జ‌ట్టు స్కోరు పూర్తిగా మంద‌గించింది. ఒక ద‌శ‌లో 20 ఓవ‌ర్లు బ్యాటింగ్ చేస్తుందా అన్న అనుమానాలు క‌లిగించినా…19.4 ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగ‌ల వ‌ద్ద 8వ వికెట్ కోల్పోయి నిర్ణీత ఓవ‌ర్ల‌లో 164 ప‌రుగుల స్కోరును ల‌క్నో సూప‌ర్ జెంట్స్ చేసింది. 166 ప‌రుగుల విజ‌యల‌క్ష్యాన్ని జీటీ ముందు ఉంచింది. LSG బౌల‌ర్ ప్ర‌సిద్ క్రిష్ణ 4 వికెట్లు ప‌డ‌గొట్టి భారీ స్కోరు చేయ‌కుండా క‌ట్ట‌డి చేశారు. మిగిలిన బౌల‌ర్లు కూడా ప్ర‌సిద్ క్రిష్ణ‌కు స‌హ‌క‌రించ‌డంతో జీటీ త‌క్కువ స్కోరుకే ప‌రిమితం చేయ‌గ‌లిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *