(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
చెన్నైసూర్ కింగ్స్, కోల్ కత్త నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో CSK ఆధిపత్యం కనబరిపరిచింది. ముందుగా తడబడుతూ బ్యాటింగ్ మొదలు పెట్టిన నిర్ణీత ఓవర్లలో 192 పరుగులు చేసి 193 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.193 పరుగుల విజయలక్ష్యంగా బరిలో దిగిన కేకేఆర్ 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై జట్టు కేకేఆర్ పై 32 పరుగుల తేడాతో విజయం సాధించిందికోల్ కత్త బౌలర్లు బ్యాటర్లకు భారీ స్కోరు చేసేందుకు పెద్దగా అవకావం ఇవ్వలేదు. ఓపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ లు ధీటుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన మూడు ఓవర్లలోనే రైడర్స్ బౌలర్లు బ్రేక్ వేశారు. ఈ సీజన్ లో ఫాం లేమితో సతమతం అవుతున్నా గౌక్వాడ్ మరోసారి అభిమానులను నిరాష పరిచారు. 7 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. 2.2. ఓవర్లలో 25 పరుగుల వద్ద గైక్వాడ్ పెవిలీయన్ చేరుకోవడంతో ఆ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన యువ క్రికెటర్ ఆయూష్ మాత్రే కోల్ కత్తా బౌలర్లపై ఆధిపత్యం చలాయించారు. క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లపై అటాక్ చేశారు.

పవర్ ప్లేలో భారీగా పరుగులు సాధించాలన్నలక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. కేవలం 17 బంతులను ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్ ల సహాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యారు. గత మ్యాచ్ లో సెంచరీ చేసి ఫాంలోకి వచ్చిన సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో కూడా నిలకడగా బ్యాటింగ్ చేశారు.6 ఓవర్లలో 72 పరుగులకు స్కోరు చేరిన సయంలో మాత్రే ఔటయ్యారు. 12వ ఓవర్ లో భారీ షాట్ ఆడబోయిన శాంసన్ 32 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటయ్యరు. దీంతో 111 పరుగుల వద్ద సీ ఎస్కే 3వ వికెట్ కోల్పోయింది. క్రీజుల్లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ జోరు మీద కనిపించినా 18 బాల్స్ ఎదుర్కొని 23 పరుగులు చేసి వెనుదిరిగారు. 162 పరుగుల వద్ద 4వ వికెట్ చెన్నై కోల్పోయింది. మకొ వైపు బ్రేవిస్ చెన్నై జట్టు స్కోరును అవకాశం వచ్చినప్పుడల్లా భారీగా పరుగులు రాబట్టారు.29 బాల్స్ ఎదుర్కొన్న బ్రేవిస్ 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు చేసి ఔటయ్యారు. 18వ ఓవర్లో 171 పరుగుల వద్ద చెన్నై 5వ వికెట్ కోల్పోయింది. చివరి ఐదు ఓవర్లలో జట్టు స్కోరు వేగం మందగించడంతో 200 పరుగుల మర్క్ ను CSK కే అందుకోలేకపోయింది.

లక్ష్యం సాధించేందుకు బరిలో దిగిన కోల్ కత్త నైట్ రైడర్స్ తడబడుతూనే ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఫిన్ అలెన్ కేవలం ఒక్క పరుగు చేసి 13 పరుగుల స్కోరు వద్ద ఔట్ కావడంతో కేకేఆర్ వత్తిడిలో పడింది.మరో ఓపెనర్ సునీల్ నరైన్ జట్టు స్కోరు పెంచేందుకు హిట్టింగ్ చేస్తూ వచ్చారు.17 బంతులు ఎదుర్కొని రెండు సిక్స్ లు, రెండు ఫోర్లతో 24 పరుగులు సాధించారు. 5 ఓవర్లలో కేవలం 29 పరుగులు మాత్రమే చేసి నరేన్ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టన్ అజింక్య రహానే, రఘువంశీల భాగస్వామ్యం కేకేఆర్ జట్టుకు కలిసి వచ్చింది. ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్లు జట్టు స్కోరు పెంచేందుకు ప్రయత్నించి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కానీ ఓవర్లు పూర్తి అవుతండడంతో పరుగులు సాధించే ప్రయత్నంలో కొద్ది వ్యవధిలోనే ఈ ఇద్దరు వెనుదిరిగారు. 9.3 ఓవర్ల వరకు వీరి భాగస్వామ్యం 50 పరుగులకు చేరుకున్న తరువాత రఘువంశీ 3వ వికెట్ గా వెనుదిరిగారు. 85 పరుగులకు స్కోరు చేరుకున్న సమయంలో రహానే కూడా ఔట్ కావడంతో 11 ఓవర్ పూర్తయ్యే సరికి చెన్నై జట్టు 85 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రింకూసింగ్ మరో ఎండ్ లో బ్యాటింగ్ లో ఉండడంతో జట్టు ఆశలు ఇంకా ఉన్నాయి. కానీ మరో ఐదు పరుగులు మాత్రమే జోడించి రింకు కూడా ఔటయ్యారు. పావెల్, రమన్ దీప్ సింగ్ లు చెన్నై బౌలర్లను ఎదుర్కంటూ పరుగులు మెల్లమెల్లగా సాధించే యత్నాలు చేశారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకోవడంతో కోల్ కొత్తా బ్యాటింగ్ లో కోలుకోలేకపోయింది.రమణ్ దీప్ 22 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేసి ఔటయ్యరు. పావెల్ 21 బంతులు ఎదుర్కొని 31 పరుగులు , అనుకుల్ ఒక్క పరుగు చేసి నాటౌట్ గా నిలిచారు.












Leave a Reply