(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కత్త నైట్ రైడర్స్ మ్యాచ్ లో CSK 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కోల్ కత్త ముందు 193 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. కోల్ కత్త బౌలర్లు బ్యాటర్లకు భారీ స్కోరు చేసేందుకు పెద్దగా అవకావం ఇవ్వలేదు. ఓపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ లు ధీటుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన మూడు ఓవర్లలోనే రైడర్స్ బౌలర్లు బ్రేక్ వేశారు. ఈ సీజన్ లో ఫాం లేమితో సతమతం అవుతున్నా గౌక్వాడ్ మరోసారి అభిమానులను నిరాష పరిచారు. 7 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. 2.2. ఓవర్లలో 25 పరుగుల వద్ద గైక్వాడ్ పెవిలీయన్ చేరుకోవడంతో ఆ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన యువ క్రికెటర్ ఆయూష్ మాత్రే కోల్ కత్తా బౌలర్లపై ఆధిపత్యం చలాయించారు. క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లపై అటాక్ చేశారు. పవర్ ప్లేలో భారీగా పరుగులు సాధించాలన్నలక్ష్యంగా బ్యాటింగ్ చే|శారు. కేవలం 17 బంతులను ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్ ల సహాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యారు. గత మ్యాచ్ లో సెంచరీ చేసి ఫాంలోకి వచ్చిన సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో కూడా నిలకడగా బ్యాటింగ్ చేశారు.

6 ఓవర్లలో 72 పరుగులకు స్కోరు చేరిన సయంలో మాత్రే ఔటయ్యారు. 12వ ఓవర్ లో భారీ షాట్ ఆడబోయిన శాంసన్ 32 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటయ్యరు. దీంతో 111 పరుగుల వద్ద సీ ఎస్కే 3వ వికెట్ కోల్పోయింది. క్రీజుల్లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ జోరు మీద కనిపించినా 18 బాల్స్ ఎదుర్కొని 23 పరుగులు చేసి వెనుదిరిగారు. 162 పరుగుల వద్ద 4వ వికెట్ చెన్నై కోల్పోయింది. మకొ వైపు బ్రేవిస్ చెన్నై జట్టు స్కోరును అవకాశం వచ్చినప్పుడల్లా భారీగా పరుగులు రాబట్టారు.29 బాల్స్ ఎదుర్కొన్న బ్రేవిస్ 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు చేసి ఔటయ్యారు. 18వ ఓవర్లో 171 పరుగుల వద్ద చెన్నై 5వ వికెట్ కోల్పోయింది. చివరి ఐదు ఓవర్లలో జట్టు స్కోరు వేగం మందగించడంతో 200 పరుగుల మర్క్ ను CSK కే అందుకోలేకపోయింది.









Leave a Reply