
ఐబీఎంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్…ఆపిల్ఏఐ వైస్ ప్రెసిడెంట్
బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్
(న్యూస్ఇన్,డెస్క్)
యాపిల్ (ఏఐ) విభాగానికి నూతన వైస్ ప్రెసిడెంట్గా భారత్కు చెందిన అమర్ సుబ్రమణ్య నియమితులయ్యారు. 16 ఏండ్లుగా గూగుల్లో పనిచేస్తున్న ఆయన అత్యంత అనుభవజ్ఞుడైన ఏఐ పరిశోధకుడిగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది జూలైలో మైక్రోసాఫ్ట్లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా చేరారు. ఏఐ రంగంలో అపార నైపుణ్యాన్ని కలిగిన అమర్ను యాపిల్కు తీసుకురావడానికి తాము సంతోషిస్తున్నామని సంస్థ సీఈవో టిమ్ కుక్ వ్యాఖ్యానించారు.అమర్ 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేశారు. 2009లో గూగుల్లో స్టాఫ్ రిసెర్చ్ సైంటిస్టుగా చేరి, వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు చేరుకున్నారు. అమర్ సుబ్రమణ్య నియామకం విషయంలో ఆపిల్ తన నిబంధనలను మార్చుకుని నియమించింది.





Leave a Reply