NewsInn

News in a Click

రేపటి నుంచి నాలుగు రోజులు చలి

వాతావరణ శాఖ

(హైదరాబాద్,న్యూస్ఇన్)

గత వారంలో రాష్ట్రంలోఅందరినీ వణికించిన చలి పులి మరోసారి పంజా విసరనుంది. శీతల గాలుల ప్రభావం కారణంగా నాలుగు రోజులపాటు రాష్ట్రంలో చలి తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.డిసెంబర్ 18-21 తేదీల మధ్య హైదరాబాద్ నగరం సహా తెలంగాణ రాష్ట్రం మొత్తం మరో సారి పెరగనుంది.


రాబోయే 4 రోజుల్లో ఉత్తర, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 6-7°C కంటే తక్కువగా, మరియు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 7-9°C కంటే తక్కువగా పడిపోనున్నాయి.
గత 10 రోజులుగా ఇప్పటికే శీతలగాలులు వీస్తున్నాయి, రాబోయే 4 రోజుల్లో మరో తీవ్ర శీతలగాలులు వచ్చే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిస్తోంది. చిన్నారులు,వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *