వాతావరణ శాఖ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
గత వారంలో రాష్ట్రంలోఅందరినీ వణికించిన చలి పులి మరోసారి పంజా విసరనుంది. శీతల గాలుల ప్రభావం కారణంగా నాలుగు రోజులపాటు రాష్ట్రంలో చలి తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.డిసెంబర్ 18-21 తేదీల మధ్య హైదరాబాద్ నగరం సహా తెలంగాణ రాష్ట్రం మొత్తం మరో సారి పెరగనుంది.

రాబోయే 4 రోజుల్లో ఉత్తర, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 6-7°C కంటే తక్కువగా, మరియు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 7-9°C కంటే తక్కువగా పడిపోనున్నాయి.
గత 10 రోజులుగా ఇప్పటికే శీతలగాలులు వీస్తున్నాయి, రాబోయే 4 రోజుల్లో మరో తీవ్ర శీతలగాలులు వచ్చే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిస్తోంది. చిన్నారులు,వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.





Leave a Reply