(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా హాట్ హాట్ గా మారిన బండి భగీరథ్ బేయిల్ కేసు వాయిదా పడడంతో పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రోజు కేసు విచారణ జరిగినా…రేపటికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్పో కేసు నమోదు అయింది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చినా… బండి సంజయ్ కేంద్ర మంత్రి కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆరు రోజులుగా కేసుకు సంబంధించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి.

బండి సంజయ్ కూడా తనయుడిపై నమోదైన కేసు విషయంలో ఎంతో ఎమోషన్ కు గురయ్యారు. తన కుమారుడు ఎలాంటి తప్పులు చేయలేదని చెబుతున్నారు…తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారని ప్రకటన చేశారు. రాజకీయంగా తీవ్రవిమర్శలు కావడంతో బండి దిద్దు బాటు చర్యలపై దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది. అయితే బాధిత బాలిక కుటుంబతో జరిగిన సంప్రదింపులు సఫలం కాకపోవడంతో….. బండి భగీరథ్ పై పోక్స్ కేసు నమోదు అయిందన్న చర్చ కూడా ఉంది. అయితే ఈ విషయంలో బండి సంజయ్ రాజకీయంగా టార్గెట్ అవుతున్నారు. బండి భగీరథ్ ను విచారించేందుకు పోలీసులు బుధవారం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ ముందస్తు బేయిల్ వ్యవహారం కోర్టులో విచారణ ఉండడంతో…15వ తేదీన విచారణకు హాజరవుతానని సమాచారం ఇచ్చారు. 14 వ తేదీ రోజు జరిగిన విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి తోడు అమ్మాయి వయస్సు పై బండి న్యాయ వాది అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ బాలిక పుట్టిన రోజుపై పోలీసులు విచారణ చేయాలని కోర్టు ఆదేశిస్తూ…బండి భగీరథ కేసు రేపటికి కోర్టు వాయిదా వేసింది.












Leave a Reply