
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కేంద్ర మంత్రి బండి సంజయ్ గత కొన్ని రోజులుగా తీవ్ర టెన్షన్ లో ఉన్నారు. తనయుడు భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కావడంతో ఎంతో ఎమోషన్ లో ఉన్న సంజయ్ కు మరో షాక్ తగిలింది. సంజయ్ తల్లి శంకుతలకు ఈ రోజు సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు. శకుంతలకు గుండెపోటు రావడంతో ఆమెను వెంటనే నగరంలోని మెడీకవర్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యులు ఆమెకు స్టంట్ వేయడంతో ప్రాణాపాయం తప్పింది. గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో శకుంతల చికిత్స పొందుతుండడంతో మంత్రి బండి సంజయ్ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సంజయ్ ఆరా తీశారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో బండి సంజయ్ కి ఉపశమనం దక్కినట్లయింది.










Leave a Reply