NewsInn

News in a Click

భ‌గీర‌థ POCSO కేసు-హై కోర్టు సీరియ‌స్

భ‌గీర‌థ POCSO కేసు-హై కోర్టు సీరియ‌స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

బండి భ‌గీర‌థ POCSO కేసు విచార‌ణ సంద‌ర్భంగా జ‌రిగిన ప‌రిణామాల‌పై హై కోర్టు సీరియ‌స్ గా స్పందించింది.తెలంగాణా రాజ‌కీయాల్లో హాట్ హాట్ గా మారిన బండి భ‌గీర‌థ పోక్సో కేసు సోష‌ల్ మీడియాలో కూడా క‌ల‌క‌లం రేపింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అదే ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అటు సోష‌ల్ మీడియా వేదిక‌లు, ఇటు విచార‌ణ‌పై అంద‌రి దృష్టి నెల‌కొంది. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా ముంద‌స్తు బేయిల్ కోసం బండి భ‌గీర‌థ హై కోర్టును ఆశ్ర‌యించారు. హై కోర్టు లో కేసు విచారిస్తున్న మ‌హిళా జ‌డ్జిపై సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ కొంత మంది పోస్టులు చేశారు. విచార‌ణ సంద‌ర్భంగానే మ‌హిళా జ‌డ్జి సోష‌ల్ మీడియా పోస్టుల గురించి ప్ర‌స్తావించారు.

కేసు విచార‌ణ కు వ‌చ్చిన స‌మ‌యంలో భ‌గీర‌థ్ కు ముంద‌స్తు బేయిల్ మంజూరు చేస్తే జ‌డ్జి మాధ‌వి భ‌ర్త‌కు బార్ కౌన్సిల్ చైర్మ‌న్ పోస్టు ఇస్తార‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా పోస్టులు వైర‌ల్ కావడం జ‌డ్జి కూడా వ్యాఖ్య‌లు చేశారు.ఆ రోజు జ‌డ్జి చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టు రిజిస్ట్రార్ చార్మినార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.కేసు విచార‌ణ సంద‌ర్బంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో న్యాయ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల‌కు అపన‌మ్మ‌కం ఏర్ప‌డుతుంద‌ని ఫిర్యాదులో రిజిస్ట్రార్ పేర్కొన్నారు. చార్మినార్ పోలీసులు ఇందుకు సంబంధించిన వివ‌రాలు సేక‌రించి చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్దం అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *