NewsInn

News in a Click

ఆ మైన‌ర్ ఫోటోలు షేర్ చేసిన వారికి షాక్

ఆ మైన‌ర్ ఫోటోలు షేర్ చేసిన వారికి షాక్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఆ మైన‌ర్ బాలిక ఫోటోలు, వీడియాలో సోష‌ల్ మీడియాలో షేర్ వారికి షాక్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. పొక్సో చ‌ట్ట ప్ర‌కారం నమోదైన FIR No. 684/2026 లో బాధిత బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు ఆమె తల్లి దండ్రులు వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయనే విషయంపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, FIR No. 706/2026, U/s. 74 of the Juvenile Justice Act, Sec. 72(1) of BNS and Sec. 23 of the POCSO Act కింద కేసు నమోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

అదేవిధంగా, ఈ విధమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ ఖాతాల ఐడీలు మరియు సంబంధిత URLలను గుర్తించి, ఆయా ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు పంపించబడినవి. అంతేకాకుండా, బాధితురాలైన బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు ఆమె తల్లి దండ్రులు సమాచారాన్ని ప్రచురించిన సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేయబడ్డాయి.ఆ మైన‌ర్ బాలిక ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన వారిని పోలీసులు గుర్తించే ప‌నిలో ప‌డ్డారు.

ఈ నెల 8వ తేదీన బాలిక స‌హా త‌ల్లి దండ్రులు ఫిర్యాదు చేసిన నాటి నుంచి సోష‌ల్ మీడియా లో ఈ కేసు కు సంబంధించిన ఫోటోలు, వీడియాలో వైర‌ల్ అయ్యాయి. బాలిక గ‌తంలో భ‌గీర‌థ్ ద‌గ్గ‌ర స‌న్నిహితంగా ఉన్న విష‌యాల‌న్నీ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ విష‌యంలో బాల‌ల హ‌క్కుల సంఘం ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

సోషల్ మీడియా నిర్వాహకులకు విజ్ఞప్తి…….

POCSO కేసుల్లో బాధిత బాలిక యొక్క వ్యక్తిగత వివరాలు లేదా తల్లి దండ్రులు వివరాలు బహిర్గతం చేయడం వల్ల బాధితురాలికి మరియు ఆమె తల్లి దండ్రులు కి తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది. ఇది చట్ట ఉల్లంఘన కూడా.ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.అయితే మైన‌ర్ బాలిక కు వ్య‌తిరేకంగా ఒక‌రు, బాలిక‌కు మ‌ద్ద‌తుగా మ‌రొక‌రు ప‌రిస్థితుల‌ను సృష్టించేందుకు పోటీ ప‌డీ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం క‌ల్పించారు. దీని వెనుక అంతా రాజ‌కీయ కుట్ర‌లే అన్న ప్ర‌చారం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *