(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పంజాబ్ కింగ్స్ ( RCB Vs PBKS) మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు సూపర్ విక్టరీ దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసన రాయల్ ఛాలెంజర్జ్ పంజాబ్ కింగ్స్ ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. 223 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోవడంతో బెంగుళూరు పట్టు సాధించింది.20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీంతో బెంగుళూరుకు విజయం వరించింది.
రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్లు జాకెబ్ బెథల్ – విరాట్ కోహ్లీ లు ఇన్నింగ్స్ ప్రారంభించి తొలి వికెట్ 21 పరుగుల వద్దేనే కోల్పోయింది కాన ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన దేవదత్ పడిక్కల్, కోహ్లీలు యుధేఛ్చగా పరుగులు సాధించారు. భారీ స్కోరు లక్ష్యంగా పడిక్కల్ హిట్టింగ్ చేయడంతో25 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తరువాత విరాట్ కోహ్లీకి వెంకటేష్ అయ్యర్ జత కట్టి స్కోరును పరుగులు పెట్టించారు. అయ్యర్ బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ బౌలర్లు ఏం చేయాలో అర్దం కాని పరిస్తితి మ్యాచ్ లో కనిపించింది.

స్టేడియం నలు వైపుల షాట్లు ఆడుతూ పంజాబ్ ను డిఫెన్స్ లోకి నెట్టారు.15వ ఓవర్ కు చేరుకునే సరికి బెంగుళూరు జ్టు స్కోరు 157 పరుగులకు చేరింది. మరిన్ని భారీ పరుగులు సాధించాలన్న లక్ష్యంగా కోహ్లీ భారీ షాట్ ఆడబోయి 37 బంతుల్లో 58 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తరువాత వెంకటేష్ అయ్యర్, టీం డెవిడ్ లు బెంగుళూరు జట్టు భారీగా పరుగులు చేసేలా బ్యాటింగ్ చేశారు. అయ్యర్ 40 బంతులు ఎదుర్కొని 4 సిక్స్ లు 8 ఫోర్లతో 73 పరుగులు చేసి నాలౌట్ గా నిలిచారు. టిం డేవిడ్ 12 బంతుల్లో 28 పరుగులు చేసి చివరి బంతికి ఔటయ్యారు. 20 ఓవర్లలో 222 పరుగులను చేసింది.
వరుస వికెట్లు కోల్పోయిన పంజాబ్…
ఆ తరువాత 223 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ కు తొలి ఓవర్ నుంచే చిక్కులు మొదలయ్యాయి. తొలి ఓవర్ లోనే ఫాంలో ఉన్న ప్రియాన్ష్ ఆర్య వెనుదిరిగారు. ఆ తరువాత మరో ఓపెనర్ ప్రభమన్ సిమ్రాన్ 18 పరుగులు చేసి 3 ఓవర్ లో 18 పరుగుల వద్దే ఔటయ్యారు.

శ్రేయస్ అయ్యార్ ఒకే పరుగు చేసి 19 పరుగులు చేసి వెంటనే ఔటయ్యారు.3.2 ఓవర్లో 19 పరుగుల వద్దనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో నిలదొక్కున్నట్లు కనిపించిన కూపర్ కాన్లీ, సూర్యిన్ష్ షిడ్గేలు బెంగెళూరు బౌలర్లను కొన్ని ఓవర్లు సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. 62 పరుగుల వద్ద కాన్లీ ఔట్ కావడంతో పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. 93 పరుగుల వద్ద 5 వ వికెట్ కూడా షిడ్గే రూపంలో ఔటయ్యారు. ఆ తరువాత మార్కస్ స్టోయినిస్, శషాంక్ సింగ్ లు బెంగుళూరు బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టుకున్నారు. స్టోయినిస్ ను హేజీల్ ఉడ్ ఔట్ చేయడంతో మరోసారి పంజాబ్ కోలుకోలేని విధంగా మారింది. క్రీజులో నిలదొక్కుకున్న శశాంక్ సింగ్ బెంగుళూరు బౌలర్లను ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేశారు.నాలుగు బంతుల్లో 29 పరుగులు చేయాల్సి రావడంతో పంజాబ్ సాధించలేకపోయింది. రశీక్ 3, భువనేశ్వర్, రశీక్ రెండు వికెట్లు తీసుకోగా మిగిలిన బౌలర్లు తలా ఓ వికెట్ తీసుకున్నారు.
శనివారం నాటి మ్యాచ్ లో కోల్ కత్త ఘనవిజయం దక్కించుకుంది….











Leave a Reply