(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
కోల్ కత్త నైట్ రైడర్స్, గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో కేకేఆర్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ బ్యాటర్లు భారీ స్కోరు చేశారు. 20 ఓవర్లలో 247 పరుగుల చేసి 248 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు.29 పరుగుల తేడాతో కేకేఆర్ విజయాన్ని అందుకుంది.కేకేఆర్ బ్యాటర్లలో రహానే మినహా మిగిలిన బ్యాటర్లంతా రాణించారు.

ఫిన్ అలెన్ గుజరాత్ బౌలర్లపై చెలరేగి ఆడాది తొలి వికెట్ ను 50 పరుగుల లోపే రహానే రూపంలో కోల్పోయిన కోల్ కొత్త ఆ తరువాత ఎక్కడా కూడా ఇబ్బందులు పడలేదు. ఫిన్ అలెన్- రఘు వంశీలు జట్టు స్కోరును భారీగా పెంచారు. ఫిన్ అలెన్ 10 సిక్స్ లు 4 ఫోర్లతో 35 బంతులు ఎదుర్కొని 93 పరుగులు చేసి ఔటయ్యారు. భారీ షాట్ ఆడబోయి బౌండ్రీ దగ్గర క్యాచ్ ఇచ్చి 139 పరుగుల వద్ద రెండో వికెట్ రూపంలో వెనుదిరిగారు. ఆ తరువాత రఘు వంశీ- కెమరన్ గ్రీన్ లు జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. రఘవంశీ కూడా ఫోర్లు, సిక్స్ లతో విరుచుకు పడ్డారు. గ్రీన్ కూడా గుజరాత్ బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టడంతో విజయవంతం అయ్యారు. వికెట్ కోల్పో కుండానే 20 ఓవర్లలో కేకేఆర్ 247పరుగులు చేసింది. రఘువంశీ 44 బంతుల్లో 88 పరుగులు చేయగా గ్రీన్ 28 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.

అనంతరం 248 పరగులు విజయ లక్ష్యంగా బరిలో దిగిన గుజరాత్ టైటన్స్ ధాఠిగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. భారీ స్కోరు కావడంతో తొలి ఓవర్ నుంచే పరుగులు రాబట్టడంపై పాంలో ఉన్న ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ లు బ్యాటింగ్ చేశారు. సాయి సుదర్శన్ కండరాలు పట్టి వేయడంతో రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగారు. ఆ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన నిషాంత్ సింధూ కేవలం ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. అప్పటీకే క్రీజులో నిలదొక్కుకున్న శుభ్ మన్ గిల్ భారీ షాట్లు ఆడుతూ స్కోరు పెంచారు. బట్లర్- గిల్ లు క్రీజులో ఉన్నంత సేపు గుజరాత్ విజయావకాశాలు కనిపించాయి.

గిల్ 49 బాల్స్ ఎదుర్కొని 85 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆ తరువాత బట్లర్ కూడా 57 పరుగులు చేసి వెనుదిరిగారు. దీంతో గుజరాత్ పై భారీ వత్తిడి పెరిగింది. కానీ కేకేఆర్ బౌలర్లు చివరి ఓవర్లు కట్టు దిట్టం గా వేయడంతో కేకేఆర్ గుజరాత్ పై సునాయసంగానే విజయం సాధించింది.20 ఓవర్లలో గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి 218 పరుగుల మాత్రమే చేయగలిగింది.
శుక్రవారం నాటి మ్యాచ్ లో లక్నో సూపర్ జెంట్స్ ఘన విజయం….











Leave a Reply