NewsInn

News in a Click

సోష‌ల్ మీడియా లో రెచ్చ‌గొడితే.. ఇక అంతే….!

సోష‌ల్ మీడియా లో రెచ్చ‌గొడితే.. ఇక అంతే….!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

సోష‌ల్ మీడియా ప్లాట్ పాంలపై నిరంత‌రం నిఘా వేసేందుకు న‌గ‌ర పోలీస్ ఏర్పాటు చేసింది. సోష‌ల్ మీడియాలో రెచ్చ‌గొడితే….వారిపై చ‌ర్చ‌లు చేప‌ట్టందుకు సిటీ పోలీస్ రెడీ అవుతోంది. సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్(సాక్ ఐ) పేరుతో సరికొత్త కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్‌ను హైద‌రాబాద్ సిటీ పోలీస్ ప్రారంభించింది. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఆన్‌లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఈ వ్యవస్థను హైదరాబాద్ పోలీస్ ఐటీ విభాగం రూపొందించింది.

గతంలో సోషల్ మీడియా పర్యవేక్షణకు భారీగా సిబ్బంది అవసరమవ్వడమే కాకుండా గంటల తరబడి మాన్యువల్‌గా శ్రమించాల్సి వచ్చేది. కానీ ఈ ‘సాక్ ఐ’ ద్వారా ఇకపై అన్నీ ఆటోమేటెడ్‌ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతాయి.

సోష‌ల్ మీడియా పై సాక్ ఐ…….

సాక్ ఐ తన ప్రయోగాత్మక దశలోనే మంచి ఫ‌లితాన్ని ఇచ్చింది. పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరమైన సున్నితమైన అంశాలను, అలాగే గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి పలు సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న 126 పోస్ట్‌లను ఇది గుర్తించింది. ఇటువంటి కంటెంట్‌ను సకాలంలో తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శాంతి సామరస్యాలను కాపాడటమే కాకుండా, విద్వేషాలను రేకెత్తించే వారిని గుర్తించడం సాధ్యమైంది. మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి పెడుతుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలను ఏఐ మోడల్స్ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి, అభ్యంతరకర పోస్టులను తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నివేదిస్తుంది.

నేరగాళ్ల నెట్‌వర్క్ విశ్లేషణ చేసే సామర్థ్యం ఈ అప్లికేషన్ ప్రత్యేకత కావడంతో, వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేసే వారిని, వాటిని వైరల్ చేసే ఖాతాలను పట్టేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంది. ప్రతి ఫిర్యాదుకు ఒక యూనిక్ ట్రాకింగ్ నంబర్ కేటాయించి, అది పరిష్కారమయ్యే వరకు ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ చేస్తుంది. నగరంలో ప్రతిరోజూ జరిగే నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపుల వంటి కార్యక్రమాలపై ముందస్తు నిఘా ఉంచేందుకు ‘ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్’ ఫీచర్‌ను ఇందులో పొందుపరిచారు. నిర్ణీత కీవర్డ్స్ ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ, ఏదైనా ముప్పు పొంచి ఉంటే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది. సోష‌ల్ మీడియాపై ఈ సాక్ ఐ నిరంత‌రం నిఘా ఉంచ‌నుంది. దీని ఆధారంగా న‌గ‌రంలో ఎక్కువ‌గా షేర్ అయ్యే సోష‌ల్ మీడియా పోస్టుల‌ను న‌గ‌ర పోలీస్ పోలీసులు విశ్లేషించే అవ‌కాశం ఉంది.

ఏఐతో చెక్ పెట్ట‌నున్న పోలీస్….

అలాగే నేర పరిశోధనలో కీలకంగా మారిన SOCMINT, OSINT వంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇందులో అంతర్భాగంగా ఉండటంతో సైబర్ కేసుల ఛేదన సులభతరం కానుంది. అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన ఈ ‘సాక్ ఐ’ వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.న‌గ‌రంలో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ఈ సాక్ అయి…రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో కూడా పోలీసులు అమ‌లు చేసే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *