(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో పనిచేస్తున్న పంచాయతీ సిబ్బందికి ఒకటో తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు అందేలా చూడాల్సిన బాద్యత అధికారులదే అన్నారు. ఒక్క రోజు జీతం ఆలస్యం అయినా సహించేది లేదని హెచ్చరించారు.తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 70(3) ప్రతిపాదిత సవరణ ప్రకారం గ్రామ పంచాయతీ స్వంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా సవరణ చేయాలని అధికారులను సీఎం ఆదేవించారు.

పెన్షన్ల పంపిణీ విధానంలో పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని ఆదేశించారు. పెన్షన్లలో దుర్వినయోగం అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ ఐడీ, ఆధార్, SEEEPC డేటా ఆధారంగా పెన్షన్లను స్ట్రీమ్ లైన్ చేయాలని, కొత్తగా అందించే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.






Leave a Reply