NewsInn

News in a Click

జనసేన యత్నాలు విఫలం-పవన్ ప్రెస్ మీట్

జనసేన యత్నాలు విఫలం-పవన్ ప్రెస్ మీట్

(హైదరాబాద్, న్యూస్ఇన్)

హైదరాబాదులో బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో జనసేన పార్టీ వేసిన హౌజ్ మోషన్ పిటిషన్‌ను తో హైకోర్టును ఆశ్రయించింది.హైకోర్టు అనుమతితో హైదరాబాదులో సభ నిర్వహించాలన్న ప్రయత్నాలు చేసింది ఇది కూడా సఫలం కాలేదు.
జనసేన పార్టీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వని పోలీసుల వ్యవహార శైలిని రాజకీయంగా తప్పుపడుతున్నారు. హైకోర్టులో కూడా జనసేన అధినేతకు సానుకూలంగా ఫలితం రాకపోవడంతో… హైదరాబాదు లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సాయంత్రం తన నివాసంలో మియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. తెలంగాణలో తాము చేయదలుచుకున్న రాజకీయ కార్యక్రమాల గురించి వివరించే అవకాశం కనిపిస్తుంది. ప్రముఖ విశ్లేషకులు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం ఈ వివాదానికి మరింత ఆద్యం పోసినట్లు అయింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలంతా నాగేశ్వర్ కు అండగా నిలుస్తున్నారు. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేయడంతో…. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన వెనక్కి తగ్గారు. అయినా ఏపీలో పలుచోట్ల నాగేశ్వర్ పై పోలీసు ఫిర్యాదు జనసేన పార్టీ నేతలు చేశారు.దీంతో నాగేశ్వర్ అరెస్టు తప్పదనే వరకు చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి రాజకీయ వైరుధ్యాలు బయటకు వచ్చాయి. తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని జనసేన పావులు కదుపుతుందన్న అనుమానాలు తెలంగాణ రాజకీయ పార్టీల్లో మొదలయ్యాయి.

Pawan Kalyan

దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఘాటుగా స్పందిస్తున్నాయి. ఆంధ్ర పార్టీలకు తెలంగాణతో ఇంకా ఏమి అవసరమంటూ నిలదీస్తున్నాయి. ఏపీలో రాజకీయం చేసుకోవచ్చని తెలంగాణలో రాజకీయం చేస్తామంటే తమ సహించబోమని తెలంగాణ ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు… నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నేతల విగ్రహాలు కూడా ఉండడంతో…. ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమ నేతల విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఓ సంఘం లేఖ రాసింది. ఏపీ సర్కార్ దీని గురించి ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడ స్పందించలేదు. కానీ జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే తెలంగాణ సెంటిమెంట్ మరోసారి రాష్ట్రంలో రైలే అవకాశం ఉందన్న చర్చకు దారితీస్తోంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నేతల ప్రభావం ఇటీవల కాలంలో తెలంగాణలో పెరుగుతోందన్న ఆరోపణలు ఇప్పటికే విపక్ష పార్టీలు చేస్తున్నాయి.

Janasena and Tdp

జనసేన తన రాజకీయ కార్యక్రమాలు హైదరాబాదులో మొదలుపెట్టి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుగుణంగా సిద్ధం కావాలన్నా లక్ష్యంగా పావులు కదిపింది. గ్రేటర్ ఫలితాలను విశ్లేషించిన అనంతరం…. ఏపీలో మాదిరిగానే ఇక్కడ కూడా కూటమి ఆధ్వర్యంలోనే అసెంబ్లీ ఎన్నికల నాటికి సిద్ధం కావాలన్నా లక్ష్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బిజెపిలు కూటమిగా ఏర్పడి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతుంది.

పవన్ కళ్యాణ్ సాయంత్రం సమావేశంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన తీస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధం అంటూ ప్రకటన చేస్తే మరోసారి రాజకీయంగా హాట్ హాట్ గా మారే అవకాశం కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *